యాప్నగరం

Diabetes : గోధుమలు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా..

Diabetes : డయాబెటీస్‌ని కంట్రోల్ చేయడం అనేదానికి ఇటీవలి అధ్యయనం చాలా సమాధానాలిచ్చింది. జనాభా ఆధారిత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియా డయాబెటిస్(ICMR-INDIAB) అధ్యయనం కొత్తగా నిర్ధారణ అయిన డయాబెటీస్, ప్రి డయాబెటిస్ కోసం కొన్ని ఆహార మార్పుల గురించి చెబుతోంది. దీని గురించి పూర్తి వివరాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 6 Sep 2022, 9:02 am
దక్షిణాసియాలో డయాబెటిస్ కారణంగా భారాన్ని తగ్గించుకోవడానికి మాక్రోన్యూట్రియెంట్ లిస్ట్‌లో కొన్ని మార్పులు అవసరం ఉందని.. ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ఇటీవల డయాబెటిస్ కేర్ అనే జర్నల్‌లో ప్రచురించబడింది.
Samayam Telugu diabetes reversal diet list says icmr study know here all details
Diabetes : గోధుమలు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా..



ప్రోటీన్ ముఖ్యం..

కొత్తగా నిర్ధారణ అయిన డయాబెటిస్ పేషెంట్స్ కార్బ్స్ తీసుకోవడానికి 55 శాతానికి తగ్గించాలని, ప్రోటీన్, కొవ్వుని వరుసగా 20 శాతం, 25 శాతంగా పెంచాలని చెబుతోంది. సాధారణంగా కార్బోహైడ్రేట్స్ మన ఆహారంలో 70 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా అధ్యయనం ఏం చెబుతోందంటే.. మరింతగా ప్లాంట్, యానిమల్ ప్రోటీన్‌ని పెంచి, పిండి పదార్థాలను తగ్గించమని. అలాగే ప్రీ డయాబెటిస్ కోసం ఇది 56 శాతం వరకూ కార్బోహైడ్రేట్స్, 20 శాతం ప్రోటీన్, 27 శాతం కొవ్వును తీసుకోవాలని సూచిస్తుంది.

ఈ పరిశోధనలో మొత్తంగా 18,090 మంది పెద్దలు పాల్గొన్నారు.

Also Read : Cooking : స్టీల్ పాత్రల్లో వంట చేస్తున్నారా..

​అన్నం, గోధుమలు తగ్గించాల్సిందే..

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి వైట్ రైస్ వినియోగాన్ని తగ్గించాలని చెబుతూ అధ్యయనం చేసిన వారిలో ఒకరైన డాక్టర్ వి మోహన్ చెప్పారు. అంతేకాదు, గోధమలు కూడా అంతగా మంచివి కాదని చెబుతున్నారు. మీరు మధ్యాహ్న భోజనంలో 2 కప్పుల అన్నం లేదా 4 రోటీలు తీసుకుంటే వాటి బదులు మీరు ఒక రోటీ లేదా ఒకటిన్నర కప్పు బియ్యాన్ని మంచి ప్రోటీన్‌తో భర్తీ చేయొచ్చు.

అదే విధంగా రెడ్ మీట్ తగ్గించాలని చెబుతున్నారు. వీటి బదులు మొక్కల నుంచి లభించే ప్రోటీన్స్, చేపలు, చికెన్ కూడా మంచిది. కానీ మాంసం తినడం కాస్తా తగ్గించాలి.

​ఎంతమందికి షుగర్ ఉందంటే..

ప్రస్తుతం భారతదేశంలో, 74 మిలియన్ల మంది డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. మరో 80 మిలియన్ల మంది ప్రీ డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. భారతదేశంలో మధుమేహం 2009లో 7.1 నుండి 2019 నాటికి 8.9 శాతానికి పెరిగింది. ప్రీ డయాబెటిక్ చాలా వేగంగా షుగర్ వ్యాధిగా మారుతుంది.

2045 నాటికి భారతదేశంలో 135 మిలియన్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతారని అంచనా.

డాక్టర్ వి మోహన్, ఈయన రచయిత కూడా.. ‘ఎపిడెమియాలజీ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఇన్ ఇండియా’ అనే 2021 పరిశోధన ప్రకారం దాదాపు 57 శాతం మంది వ్యక్తులకి రోగనిర్ధారణ జరగలేదు. ప్రపంచ మధుమేహ మహమ్మారిలో చైనా తర్వాత భారతదేశం రెండో స్థానంలో ఉంది.

Also Read : Healthy Breakfast : ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయట..

​2045 నాటికి..

భారతదేశంలోని మొత్తం మధుమేహ వ్యాధిగ్రస్తులలో 12.1 మిలియన్లు 65 సంవత్సరాల వయస్సు గలవారు, 2045 సంవత్సరం నాటికి 27.5 మిలియన్లకి పెరుగుతుందని అంచనా వేయబడింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం, మహమ్మారి ప్రపంచాన్ని తాకడానికి ఒక సంవత్సరం ముందు 2019లో, మధుమేహం 1.6 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది. నాన్ కమ్యూనికేషన్ వ్యాధుల వల్ల సంభవించే అన్ని మరణాలలో 9వ స్థానంలో ఉంది. ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ తర్వాత స్ట్రోక్, క్రానిక్ అబ్ర్స్టక్టివ్ పల్మనరీ డిసీజ్, లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. 2000 నుండి 80 శాతం పెరుగుదలతో, మొదటి 10 మందిలో పురుషుల మరణాలలో అత్యధిక పెరుగుదలకి మధుమేహం కూడా కారణం అని WHO పేర్కొంది.

​మధుమేహం వచ్చే ప్రమాదం ఎవరికీ ఎక్కువగా ఉందంటే..

  • ఊబకాయం
  • ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం
  • సరైన ఆహారం తీసుకోకపోవడం
  • చెడ్డ అలవాట్లు
  • వంశపారం
  • నిద్రలేమి
  • ఒత్తిడి
  • కాలుష్యానికి గుర్వవడం
  • కంట్రోల్ లేని బీపి
  • రక్తంలో కొవ్వు అధికంగా ఉండడం..

నియంత్రిత రక్తపోటు, లిపిడ్ స్థాయి మధుమేహంతో సంబంధ ఉన్న వారికి సమస్యలు దూరంగా ఉంటాయి.

చాలా ప్రమాద కారకాలు సవరించదగినవి. వీటిలో చిన్న మార్పులు మధుమేహ ప్రమాదాన్ని తగ్గించగలవని చెబుతున్నాయి.

​చివరిగా..

షుగర్ వ్యాది ఓ సమస్య. ఇది ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వారికి గుండె సమస్యలు అధికంగా వస్తాయి. నియంత్రిత మధుమేహం వాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ భారం చాలా వరకూ మాక్రోవాస్కులర్ అంటే హృదయనాళ, సెరెబ్రోవాస్కులర్, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధులకి కారణమవుతుంది. మైక్రోవాస్కులర్ అంటే డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి సమస్యల వలన కలుగుతుందని 2021 పరిశోధనలో వెల్లడైంది.

Also Read : Sleep : మీ బెడ్‌ని షేర్ చేసుకుంటున్నారా..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.