యాప్నగరం

అరటి పండ్లు, కాయలు.. షుగర్ పేషెంట్స్‌కి ఏవి మంచివి..

డయాబెటిస్.. ఈ తీపి రోగం వచ్చిందంటే చాలు.. దీన్ని చుట్టూ ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్య రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి.

Samayam Telugu 13 Jun 2020, 9:01 am
పచ్చి అరటికాయ.. వీటితో ఎన్నో వంటలు చేస్తుంటారు. చిప్స్, బజ్జీ, కూరలు ఇలా రకరకాల వెరైటీస్ చేస్తుంటారు. ఇది కేవలం ఓ కూరగాయ అని అనుకుంటారు చాలా మంది. కానీ, దీనిని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. పచ్చి అరటికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అదే విధంగా.. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థని మెరుగు చేస్తుంది.
Samayam Telugu raw banana istock




Also Read : కాళ్లకి పట్టీలు పెట్టుకుంటే డెలివరీ టైమ్‌లో నొప్పులు రావా..

బాడీలోని వ్యర్థాలను బయటకి పంపించడంలో ఫైబర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మలబద్దక సమస్య ఉండదు. తిన్న ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేసేందుకు ఈ అరటి పండ్లు బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా.. ఇందులోని పొటాషియం నాడీ వ్యవస్థను చురుగ్గా చేస్తుంది.. కిడ్నీలలోని రక్తాన్ని ప్యూరి ఫై చేస్తుంది..

టైప్ 2 డయాబెటీస్..

ఇక టైప్ 2 డయాబెటీస్‌తో బాధపడేవారు అరటి పండు కంటే కాయని తినడం ఉత్తమమని చెబతున్నారు నిపుణులు. ఎందుకంటే కాయలతో పోల్చితే.. పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.. అది కాస్తా సమస్యగా మారుతుంది. అం కాయలను తినాలి. వీటిని ఉడికించి తినాలి..

Also Read : ఈ టైమ్‌లో లవర్‌ని ముద్దు పెట్టుకుంటున్నారా..

అరటికాయ తినడం వల్ల బెనిఫిట్స్..

అరటికాయలను ఉడికించి తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. అందుకే వీటిని రోజుకి ఒక్కటైనా తింటే సమస్యలు తగ్గిపోతాయి.

డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ఏవి తినాలి ఏవి తినకూడదు అన్న విషయంపై వారికి కచ్చితమైన అవగాహన ఉండాలి. అదే విధంగా అన్ని పండ్లు తినకూడదు. కొన్ని మాత్రమే తీసుకోవాలి. అందులో అరటికాయలు ఒకటి.. వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. మెటబాలిజం పెరుగుతుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ రెండు షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిది. ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు దూరమై.. మలబద్ధకం వంటి ఉండవు. దీంతో కడుపులోని వ్యర్థాలన్నీ కూడా వెళ్లిపోతాయి.



అయితే, తినమన్నారు కదా అని వాటి చిప్స్ చేసి ఎక్కువగా నూనెలో ఉడికించి తినకూడదు. దీని వల్ల లాభం అంతగా ఉండదు.. పచ్చికాయలను చిన్న ముక్కలుగా చేసి ఆవిరిపై ఉడికించి తినొచ్చు.. మీకు అవసరం అనుకుంటే కాస్తా మరీ తక్కువగా తేనె కానీ, మిరియాల పొడి కానీ పై నుంచి చల్లి తినేయొచ్చు.. కానీ, అతి తక్కువ మాత్రమే ఎక్కువగా తినకూడదు.

Also Read : గులాబీ పూలని తింటే వీర్యవృద్ధి అవుతుందా.. శోభనపు గదిని ఎందుకు వీటితో అలంకరిస్తారు..

వీటితో పాటు పచ్చికాయలను తినడం కండరాలలో ఫ్లెక్సీబిలిటీ పెరుగుతంది. శరీరానికి మంచి బ్యాక్టీరియా అందుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలో జీర్ణ వ్యవస్థని సరిగ్గా ఉంచి అన్ని జీవక్రియలను మెరుగ్గా చేస్తుంది.. ఇన్ని లాభాలు ఉన్న అరటికాయలను మీరు మిస్ చేయకండి.. రెగ్యులర్‌గా తినడం స్టార్ట్ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.