చలికి వణికిపోతున్నారా? బెల్లం, పల్లీ చక్కీలు తినండి.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చలికి వణికిపోతున్నారా? టైమ్ పాస్ కోసం ఏమైనా తినాలని అనుకుంటున్నారా? అయితే, పల్లీ ఉండలు తినండి. దీని ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.
Samayam Telugu 4 Dec 2020, 10:56 am
పల్లీలు లేదా వేరుశనగ ఉండలు లేదా చక్కీ/పట్టీలు మీకు గుర్తున్నాయా? డైరీ మిల్క్.. ఫైస్టార్ వంటివి రానప్పుడు పిల్లలు వాటినే చాక్లెట్లలా తినేవారు. అయితే, ఇప్పుడు చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటి పిల్లలకు వీటి గురించి తెలియనే తెలీదు. మన పూర్వికులు ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం.. ఇలాంటి ఆహారమే. పల్లీలు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో పల్లీలు+బెల్లం చక్కీ/పట్టీలు చేసే మ్యాజిక్ గురించి తెలిస్తే.. ఈ సీజన్లోనే వాటిని మీ డైట్లో చేర్చుకుంటారు. మరి, వాటి ప్రయోజనాలేమిటో చూసేద్దామా!
✺ చలికాలంలో బెల్లం, వేరుశనగ కలిపి తింటే శరీరానికి వేడి లభిస్తుంది.
✺ పల్లీల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి.
✺ బెల్లంలో ఇనుము, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి.
✺ శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. కానీ వీటిని మరీ ఎక్కువగా తినొద్దు.
✺ రక్త సమస్యలు లేదా మరేదైనా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకున్నాకే తినాలి.
✺ పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.
Read Also: ‘నా స్నేహితురాలికి నా భర్త దగ్గరయ్యాడు.. ఆ మెసేజ్ చూసి గుండె ఆగింది’
✺ పల్లీలను తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడతుంది.
✺ వేరు శనకలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
✺ డయాబెటీస్ బాధితులు మినహా మిగతావారు రోజుకు 20 గ్రాముల బెల్లం తినడం మంచిదే.
✺ బెల్లం, వేరుశనగలను కలిపి తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
✺ పల్లీలో ఉండే పీచు పదార్థాలు ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
✺ వేరుశనగ, బెల్లం ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపేస్తాయి.
✺ బెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి.
Read Also: అద్భుతం.. 27 ఏళ్ల నాటి పిండం, ఇప్పుడు బిడ్డగా జన్మించింది.. ఇది వరల్డ్ రికార్డ్!
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. పలు అధ్యయనాల్లో తేలిన అంశాలను మీకు తెలియజేయడానికే ఈ కథనం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. వీటిని మీ డైట్లో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నా లేదా మరింత సమాచారం తెలుసుకోవాలన్నా తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించాలని మనవి. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.
✺ చలికాలంలో బెల్లం, వేరుశనగ కలిపి తింటే శరీరానికి వేడి లభిస్తుంది.
✺ పల్లీల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి.
✺ బెల్లంలో ఇనుము, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి.
✺ శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. కానీ వీటిని మరీ ఎక్కువగా తినొద్దు.
✺ రక్త సమస్యలు లేదా మరేదైనా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకున్నాకే తినాలి.
✺ పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.
Read Also: ‘నా స్నేహితురాలికి నా భర్త దగ్గరయ్యాడు.. ఆ మెసేజ్ చూసి గుండె ఆగింది’
✺ పల్లీలను తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడతుంది.
✺ వేరు శనకలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
✺ డయాబెటీస్ బాధితులు మినహా మిగతావారు రోజుకు 20 గ్రాముల బెల్లం తినడం మంచిదే.
✺ బెల్లం, వేరుశనగలను కలిపి తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
✺ పల్లీలో ఉండే పీచు పదార్థాలు ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
✺ వేరుశనగ, బెల్లం ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపేస్తాయి.
✺ బెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి.
Read Also: అద్భుతం.. 27 ఏళ్ల నాటి పిండం, ఇప్పుడు బిడ్డగా జన్మించింది.. ఇది వరల్డ్ రికార్డ్!
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. పలు అధ్యయనాల్లో తేలిన అంశాలను మీకు తెలియజేయడానికే ఈ కథనం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. వీటిని మీ డైట్లో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నా లేదా మరింత సమాచారం తెలుసుకోవాలన్నా తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించాలని మనవి. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.