యాప్నగరం

రక్త హీనతకు ఎండు ద్రాక్షతో చెక్

ఎండు ద్రాక్షను ఎంత తింటే అంత మంచిది. ముఖ్యంగా అమ్మాయిలకి ఇంకా మంచిది.

TNN 30 Dec 2016, 7:35 pm
ఎండు ద్రాక్షను ఎంత తింటే అంత మంచిది. ముఖ్యంగా అమ్మాయిలకి ఇంకా మంచిది. ఎందుకంటే మహిళల్లో అనేక మందికి రక్త హీనత సమస్య ఉంటుంది. అలాంటి వాళ్లు రోజూ ఎండు ద్రాక్ష తినడం అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందులో ఉండే ఇనుము, విటమిన్ బి, రాగి పుష్కలంగా ఉంటాయి. ఎర్రరక్తకణాల పుట్టుకను పెంచడానికి ఇవి దోహదపడతాయి. ఇక బరువు తగ్గాలనుకునేవారు కూడా ఎండుద్రాక్ష తినొచ్చు. వీటిని కొంచెం తింటే చాలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దాని వల్ల తక్కువ తింటారు.
Samayam Telugu health benefits of prunes
రక్త హీనతకు ఎండు ద్రాక్షతో చెక్



క్యాన్సర్ కారకాలను దూరం చేయడంతో పాటూ, చెడు కొలెస్ట్రాల్ ఒంట్లో పేరుకోకుండా చేస్తుంది. పిల్లలకు రోజూ ఉదయాన టిఫిన్ సమయంలో వీటిని తినడం అలవాటు చేయాలి. ఇందులో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు గట్టిపడతాయి. ఎండుద్రాక్ష రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నోటి దుర్వాసన తగ్గడానికి ఎండు ద్రాక్షను నోట్లో వేసుకుని నములుతూ ఉంటే ఫలితం ఉంటుంది. చిగుళ్ల సమస్యకు కూడా దీంతో చెక్ పెట్టొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.