యాప్నగరం

రోజూ ఓ అరటి పండు తినండి...ఆరోగ్యంగా ఉండండి!

రోజుకు ఒక అరటి పండు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడమే కాదు, ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

TNN 14 Feb 2017, 7:57 pm
రోజూ ఓ అరటి పండు తింటే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చట. రోజుకు ఒక అరటి పండు తినడం వల్ల శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనతను దూరం చేస్తుంది.
Samayam Telugu health benfits of eating of banana daily
రోజూ ఓ అరటి పండు తినండి...ఆరోగ్యంగా ఉండండి!


అరటి పండులో విటమిన్స్, ఖనిజ లవణాలు, ఫైబర్, పొటాషియం లాంటివి ఎక్కువగా ఉంటాయి. దీన్ని వల్ల శరీరానికి రోజంతా శక్తి లభిస్తుంది. అలాగే ఫైబర్ హృద్రోగ సమస్యలను దూరం చేసి, అసిడిటీని తగ్గిస్తుంది.

అరటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం, సోడియం తక్కువ మోతాదులో ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి కంటికి కూడా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

దీనిలో ఉండే పోషకాలు చక్కెర వ్యాధిని నియత్రిస్తాయి. కాబట్టి భోజనం తర్వాత దీన్ని తీసుకోవాలి.

అధిక బరువుతో ఇబ్బంది పడేవారు అరటి పండు తింటే ఉపశమనం లభిస్తుంది. దీనిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను తగ్గించి వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది. అలాగే కొన్ని వ్యాధుల తీవ్రతను కూడా తగ్గిస్తుంది.

వారంలో చాలాసార్లు అరటిపండు తీసుకుంటే 50 శాతం వరకు కిడ్నీ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఈ విషయం పరిశోధనలో కూడా నిజమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.