యాప్నగరం

మధుమేహమా? గ్లాసుడు పాలు తాగండి!

రక్తంలో చక్కెర శాతం తగ్గించేందుకు డైట్ పాటిస్తున్నట్లయితే.. ఆహారంతో పాటే గ్లాసుడు పాలు కూడా తీసుకుంటే మంచిదట.

Samayam Telugu 20 Aug 2018, 11:36 pm
క్తంలో చక్కెర శాతం తగ్గించేందుకు డైట్ పాటిస్తున్నట్లయితే.. ఆహారంతో పాటే గ్లాసుడు పాలు కూడా తీసుకుంటే మంచిదట. యూనివర్శిటీ ఆఫ్ టొరంటో సహకారంతో యూనివర్శిటీ ఆఫ్ గుల్ఫ్‌లోని హ్యూమన్ న్యూట్రాస్యూటికల్ రీసెర్చ్ యూనిట్‌‌కు చెందిన హెచ్.డగ్లస్ గోఫ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.
Samayam Telugu nbk32b7_biker-asbak-mon-650_625x300_19_August_18


అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) సమయంలో అధిక ప్రోటీన్లు కలిగిన పాలు.. బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. తృణధాన్యాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్న తర్వాత నీటికి బదులు పాలు తాగినట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నట్లు కనుగొన్నారు.

ఈ పరిశోధనలపై గొఫ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో జీవక్రియ వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టైప్-2 మధుమేహం, ఊబకాయం వంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రయోగంలో బ్రేక్‌ఫాస్ట్ తర్వాతే కాకుండా లాంచ్ తర్వాత పాలు తాగినా మంచి ఫలితం ఉంటుంది’’ అని తెలిపారు. మరి, మీరు కూడా ఓసారి ప్రయత్నించి.. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను ఓసారి చెక్ చేసుకోండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.