యాప్నగరం

ఇలా చేస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు

వేసవి మొదలైంది. ప్రచండ భానుడు అప్పుడే ప్రభావం చూపుతున్నాడు. అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గి వడదెబ్బకు దారితీస్తుంది.

TNN 20 Mar 2017, 7:21 pm
వేసవి మొదలైంది. ప్రచండ భానుడు అప్పుడే ప్రభావం చూపుతున్నాడు. అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గి వడదెబ్బకు దారితీస్తుంది. కాబట్టి శరీర సమతాస్థితిని కాపాడుకోడానికి నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. అలాగే ఎండల్లో దూర ప్రయాణాలు లేకుండా ప్రణాళికలు వేసుకోవాలి. ఎక్కువగా ఎండలో తిరిగితే చర్మంలోని ఎర్ర రక్తకణాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల కిడ్నీలు, కాలేయం దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Samayam Telugu how to prevent heat exhaustion and sun stroke
ఇలా చేస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు


వడదెబ్బకు గురైన వారికి వాంతులు, తలతిరగడంతోపాటు ఉష్ణోగ్రత పెరగడం వల్ల చెమట రాకుండా పల్స్‌ రేటు పడిపోవడం, స్ప్రుహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం లాంటి లక్షణాలు బహిర్గతమవుతాయి. ఇది ఒక్కోసారి ఆకస్మిక మరణానికి కూడా దారితీయవచ్చు. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే శరీరంలోని నీటి సమతౌల్యతను కాపాడుకుని, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.

అధిక ఉష్ణోగ్రత సమయంలో తిరగడం వల్ల మెదడు సమతౌల్యతను కోల్పోతుంది. దీంతో అత్యధికంగా మరణాలు సంభవిస్తాయి. వడదెబ్బ తగిలిన వాళ్లను వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలి. బట్టలు వదులు చేసి ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీళ్లతో తుడవాలి, ఇలా చేస్తే రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రథమ చికిత్స తర్వాత వీరిని ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్‌ అందించాలి.

ఎండలో తిరిగే వాళ్లు టోపీలు, స్కార్ఫ్‌లు ధరించాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవటం మంచిది. ఒకవేళ తప్పనిసరి అయితే మాత్రం చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అరగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తీసుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.