యాప్నగరం

సెల్ఫీ చావుల్లో ఇండియానే టాప్

సెల్ఫీ దిగు.. సోషల్ మీడియాలో పెట్టు.. ఇప్పుడు కుర్రకారు మోజంతా సెల్ఫీల మీదే. సెల్ఫీల కారణంగా భారతీయ యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతోందని తేలింది.

TNN 18 Nov 2016, 1:15 pm
సెల్ఫీ దిగు.. సోషల్ మీడియాలో పెట్టు.. ఇప్పుడు కుర్రకారు మోజంతా సెల్ఫీల మీదే. ఏదైనా కొత్త వస్తువు కొన్నా.. కొత్త ప్రదేశానికి వెళ్లినా సెల్ఫీ దిగడం ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడమే. ఇదే చాలా మంది యువత ప్రాణాలు పొగొట్టుకోవడానికి కారణమవుతోంది. ఎత్తయిన కొండ అంచున నిలబడి సెల్ఫీ దిగుతూ ఒకరు, వేగంగా వస్తున్న రైలు పక్కన నిల్చుని మరొకరు, నది ఒడ్డున నిలబడి మరొకరు.. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన వారెందరో. సెల్ఫీ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువగా భారత్‌లోనే చోటు చేసుకుంటున్నాయట.
Samayam Telugu india accounts for highest selfie related deaths in the world
సెల్ఫీ చావుల్లో ఇండియానే టాప్


ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకూ 127 సెల్ఫీ మరణాలు సంభవిస్తే.. అందులో 76 ఒక్క మన దేశంలో చోటు చేసుకున్నవే. మరణించిన వారిలో 24 ఏళ్లలోపు వారే ఎక్కువ మంది ఉన్నారట. అమెరికాకు చెందిన కార్నేగి మిలన్, ఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సెల్ఫీల కారణంగా చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ముంబై పోలీసులు 16 ప్రాంతాలను నో సెల్ఫీ జోన్‌గా ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.