జీవనశైలిలో పెరిగిన వేగం కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిళ్లవల్ల పలు రుగ్మతల బారిన పడుతున్న వారికి ఉపశమనం కలిగించే యోగాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు 2014 సెప్టెంబర్లో ఐక్య రాజ్యసమితిలోని మెజారిటీ సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలంటూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూన్ జీఏ) డిసెంబర్ 11, 2014న ప్రకటించింది. ఒక దేశం చేసిన ప్రతిపాదనలో 177 దేశాలు సహభాగస్తులు కావడం అదే తొలిసారి. అందులో అఫ్ఘాన్, టర్కీ, ఇరాన్, ఇండొనేసియా, ఖతార్, ఒమన్వంటి 47 ఇస్లామిక్ దేశాలు కూడా ఉండటం విశేషం.
నిరంతరం అభిమానించి, ప్రేమించాల్సిన వారి కోసం పాశ్చాత్యులు కొన్ని రోజులను కేటాయించడంపై మన దగ్గర చాలామందికి అభ్యంతరం ఉంది. ఫాదర్స్ డే, మదర్స్ డే వంటివాటిని కొందరు అందుకే వ్యతిరేకిస్తారు. అలా చూస్తే యోగా కోసం ఒక రోజును కేటాయించడమేమిటన్న ప్రశ్నగతంలో నెలకొంది. అయితే ఆ తర్వాత అందరూ అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో గతేడాది తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలోని రాజపథ్ యోగా పథ్గా మారడం.. ఎత్తయిన సరిహద్దు ప్రాంతం సియాచిన్ మంచుపర్వత శ్రేణి మొదలుకొని సముద్ర జలాల్లోని యుద్ధ నౌకల వరకూ అనేకం యోగాసనాల వేదికలవడం మనకు విదితమే.
గతేడాది తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ప్రపంచమంతా ఘనంగా జరుపుకోగా.. పాకిస్తాన్ మాత్రం దూరంగా ఉండిపోయింది. ఈ సారి అక్కడ కూడా యోగా కార్యక్రమాలు జరుగుతుండటం విశేషం. అంతర్జాతీయ యోగా దినోత్సవం గతేడాది ఒకే వేదికపై నుంచి అత్యధిక మంది యోగాసనాలు వేయడంతో పాటు, ఒకేచోట అత్యధిక దేశాల వారు యోగాసనాలు వేసిన నేపథ్యంలో గిన్నిస్ బుక్ వారు రెండు ప్రపంచ రికార్డులు నమోదుచేశారు. ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద ఒకే వేదికపై 35,985 మంది యోగాసనాలు వేశారు. అదేవిధంగా 84 దేశాలకు చెందిన వారు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిరంతరం అభిమానించి, ప్రేమించాల్సిన వారి కోసం పాశ్చాత్యులు కొన్ని రోజులను కేటాయించడంపై మన దగ్గర చాలామందికి అభ్యంతరం ఉంది. ఫాదర్స్ డే, మదర్స్ డే వంటివాటిని కొందరు అందుకే వ్యతిరేకిస్తారు. అలా చూస్తే యోగా కోసం ఒక రోజును కేటాయించడమేమిటన్న ప్రశ్నగతంలో నెలకొంది. అయితే ఆ తర్వాత అందరూ అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో గతేడాది తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలోని రాజపథ్ యోగా పథ్గా మారడం.. ఎత్తయిన సరిహద్దు ప్రాంతం సియాచిన్ మంచుపర్వత శ్రేణి మొదలుకొని సముద్ర జలాల్లోని యుద్ధ నౌకల వరకూ అనేకం యోగాసనాల వేదికలవడం మనకు విదితమే.
గతేడాది తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ప్రపంచమంతా ఘనంగా జరుపుకోగా.. పాకిస్తాన్ మాత్రం దూరంగా ఉండిపోయింది. ఈ సారి అక్కడ కూడా యోగా కార్యక్రమాలు జరుగుతుండటం విశేషం. అంతర్జాతీయ యోగా దినోత్సవం గతేడాది ఒకే వేదికపై నుంచి అత్యధిక మంది యోగాసనాలు వేయడంతో పాటు, ఒకేచోట అత్యధిక దేశాల వారు యోగాసనాలు వేసిన నేపథ్యంలో గిన్నిస్ బుక్ వారు రెండు ప్రపంచ రికార్డులు నమోదుచేశారు. ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద ఒకే వేదికపై 35,985 మంది యోగాసనాలు వేశారు. అదేవిధంగా 84 దేశాలకు చెందిన వారు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.