యాప్నగరం

కలుషిత గాలిని పీల్చేవారికి.. పొంచి ఉన్న ప్రమాదం!

ఎక్కువకాలం కలుషిత గాలిని పీల్చేవారిలో మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నికెల్‌ వంటి కొన్నిరకాల హానికర లోహ కణాల వల్ల క్యాన్సర్‌ కారక జన్యువులు ఉత్తేజితమవుతున్నట్లు గుర్తించారు.

TNN 13 May 2018, 7:54 pm
ఎక్కువకాలం కలుషిత గాలిని పీల్చేవారిలో మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. కలుషిత గాలిని శ్వాసించడం ద్వారా.. మెదడులో క్యాన్సర్‌ కారక జన్యువులు ఉత్తేజితమవుతాయని 'సీదార్స్‌- సినాయ్‌ మెడిసిన్‌ రిసెర్చ్‌ సెంటర్‌' పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనం కోసం వీరు లాస్‌ ఏంజెల్స్‌లోని కాలుష్యకారక ప్రాంతాలు, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని కలుషిత గాలిలో నికెల్‌ వంటి కొన్నిరకాల హానికర లోహ కణాలున్నట్లు తేల్చారు.
Samayam Telugu cancer1


గాలిని పీల్చినప్పుడు ఇవి మొదట ఊపిరితిత్తుల్లోకి, తర్వాత రక్తంలోకి చేరుతాయి. క్రమంగా మెదడు అంతర్భాగాల్లోకీ చొచ్చుకెళ్తాయి. వీటి కారణంగా క్యాన్సర్‌ కారక జన్యువులు ఉత్తేజితమవుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.