కరోనా వైరస్ను తక్కువ అంచనా వేస్తూ.. మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరిగే మూర్ఖులను మీరు చూసే ఉంటారు. వీరు కావాలని ప్రమాదం కొనితెచ్చుకోవడమే కాకుండా.. వారి కుటుంబాన్ని సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. కనీస నియమాలు పాటించుకుండా ఇతరులు ప్రమాదకరంగా మారుతున్నారు. బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు. చివరికి కరోనా వైరస్ అంటించుకొని ప్రాణాలను నిలబెట్టుకోడానికి పోరాడుతున్నాడు. ఈ సందర్భంగా అతడు ఐసీయూ నుంచి ఓ వీడియో సందేశాన్ని అందించాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
‘‘కరోనా లేదు.. ఏం లేదు. అది సాధారణ వ్యాధి. అది నన్ను ఏం చేయలేదు’’ అంటూ తిరిగిన క్రిస్ గ్రయిలీ (29).. ఇప్పుడు ఆ వైరస్ ప్రభావాన్ని స్వయంగా అనుభవిస్తున్నాడు. కరోనాపై తన అంచనాలు తప్పయ్యాయని, తనలా మరెవ్వరూ ప్రవర్తించకూడదని తెలుపుతున్నాడు. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని విడిచి జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాడు. ఈ సందర్భంగా అతడు ఐసీయూ నుంచి ఓ వీడియోను విడుదల చేశాడు. తాను ఎదుర్కొంటున్న నరకయాతన గురించి వివరించాడు.
మంచేస్టర్లోని అంకోట్స్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న క్రిస్.. ఇటీవల లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి స్పెయిన్లో పర్యటించాడు. కరోనా వైరస్ అనేదే లేదంటూ.. మాస్క్ పెట్టుకోకుండా తిరిగాడు. పలువురు అతడిని హెచ్చరించినా.. పట్టించుకోలేదు. ఫలితంగా అతడికి కరోనా సోకింది.
‘‘వైరస్ను తక్కువ అంచనా వేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాను. నేను చేసిన పొరపాటును మీరు చేయకండి. నేను ఇప్పుడు ఐసీయూలో ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. వైద్యులు తమ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే.. ఈ దుస్థితి మీలో ఎవరికైనా ఎదురుకావచ్చు’’ అని తెలిపాడు.
‘‘క్యానరీ ఐలాండ్లో ఉన్నప్పుడు నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఏం తిన్నా నాలుకకు రుచి తెలిసేది కాదు. వాసన తెలిసేది కాదు. జలుబుగా ఉండేది. చెమటలు కూడా పట్టేవి. ఆ పరిస్థితిలోనే నేను ఇంటికి తిరిగి వెళ్లిపోయా. కానీ, అప్పటికే నా పరిస్థితి దయనీయంగా మారింది.దీంతో వైద్య పరీక్షలు చేయించుకున్నా. నాకు కోవిడ్-19 అని తేలింది’’ అని పేర్కొన్నాడు.
Read Also: 16 ఏళ్ల వయస్సు.. మాంసం ముద్దలా మారిన శరీరం, ఆమెను అలా చేసింది ఎవరు?
‘‘కరోనాతో నేను దాదాపు నరకయాతన అనుభవిస్తున్నా. ప్రాణం మీద ఆశలు వదిలేసుకున్నా. నేను ఊపిరి పీల్చుకోలేపోతున్నా, నడవలేక పోతున్నా. నా పరిస్థితి జాంబీలా ఉంది. 24/7 ఆక్సిజన్ పెడుతున్నాడు. నాలుగు రకాల యాంటీబయోటిక్స్ అందిస్తున్నారు. సూదులతో నా చేతులు పుండులా తయారయ్యాయి. కరోనా మీద ప్రభుత్వం చెబుతున్నది కాకమ్మ కథలన్నీ నేను గతంలో చెప్పాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని వెల్లడించాడు.
Read Also: కరోనా కలవరం, బాలు మరణం.. ఈ కారణాలే ఆయన్ని కోలుకోనివ్వలేదా?
‘‘కరోనా వైరస్ అనేది నిజం. ఇది నన్ను చంపేస్తోంది. మీరు ఏదైనా పార్టీలకు వెళ్లేప్పుడు లేదా బయటకు వెళ్లేప్పుడు ఒకసారి ఆలోచించండి. కుర్రాళ్లకు వైరస్ అంటుకోదనే భ్రమతో ఉండేవాడిని. నా వయస్సు 29, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూడండి. మేల్కోండి.. మనకు ఇంకా బోలెడంత జీవితం ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే ఆ జీవితాన్ని చూడగలం. నాలా మరెవ్వరూ తప్పు చేయొద్దు’’ అని క్రిస్ వెల్లడించాడు. చూశారుగా.. ఇప్పటికైనా వైరస్తో జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల మీ కుటుంబాలను సైతం ప్రమాదంలోకి నెట్టకండి. మాస్క్ పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరిగే మూర్ఖుల నుంచి దూరంగా ఉండండి.
క్రిస్ మాట్లాడిన వీడియో ఇదే:
గమనిక: కరోనా బాధితుడుక్రిస్ చెప్పిన వివరాలను యథావిధిగా అందించాం. ఇందులో అతను పేర్కొన్న అంశాలన్నీ అతని వ్యక్తిగతం. కరోనాపై అవగాహన కోసమే ఈ కథనాన్ని అందించామని గమనించగలరు.
‘‘కరోనా లేదు.. ఏం లేదు. అది సాధారణ వ్యాధి. అది నన్ను ఏం చేయలేదు’’ అంటూ తిరిగిన క్రిస్ గ్రయిలీ (29).. ఇప్పుడు ఆ వైరస్ ప్రభావాన్ని స్వయంగా అనుభవిస్తున్నాడు. కరోనాపై తన అంచనాలు తప్పయ్యాయని, తనలా మరెవ్వరూ ప్రవర్తించకూడదని తెలుపుతున్నాడు. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని విడిచి జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాడు. ఈ సందర్భంగా అతడు ఐసీయూ నుంచి ఓ వీడియోను విడుదల చేశాడు. తాను ఎదుర్కొంటున్న నరకయాతన గురించి వివరించాడు.
మంచేస్టర్లోని అంకోట్స్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న క్రిస్.. ఇటీవల లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి స్పెయిన్లో పర్యటించాడు. కరోనా వైరస్ అనేదే లేదంటూ.. మాస్క్ పెట్టుకోకుండా తిరిగాడు. పలువురు అతడిని హెచ్చరించినా.. పట్టించుకోలేదు. ఫలితంగా అతడికి కరోనా సోకింది.
‘‘వైరస్ను తక్కువ అంచనా వేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాను. నేను చేసిన పొరపాటును మీరు చేయకండి. నేను ఇప్పుడు ఐసీయూలో ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. వైద్యులు తమ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే.. ఈ దుస్థితి మీలో ఎవరికైనా ఎదురుకావచ్చు’’ అని తెలిపాడు.
‘‘క్యానరీ ఐలాండ్లో ఉన్నప్పుడు నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఏం తిన్నా నాలుకకు రుచి తెలిసేది కాదు. వాసన తెలిసేది కాదు. జలుబుగా ఉండేది. చెమటలు కూడా పట్టేవి. ఆ పరిస్థితిలోనే నేను ఇంటికి తిరిగి వెళ్లిపోయా. కానీ, అప్పటికే నా పరిస్థితి దయనీయంగా మారింది.దీంతో వైద్య పరీక్షలు చేయించుకున్నా. నాకు కోవిడ్-19 అని తేలింది’’ అని పేర్కొన్నాడు.
Read Also: 16 ఏళ్ల వయస్సు.. మాంసం ముద్దలా మారిన శరీరం, ఆమెను అలా చేసింది ఎవరు?
‘‘కరోనాతో నేను దాదాపు నరకయాతన అనుభవిస్తున్నా. ప్రాణం మీద ఆశలు వదిలేసుకున్నా. నేను ఊపిరి పీల్చుకోలేపోతున్నా, నడవలేక పోతున్నా. నా పరిస్థితి జాంబీలా ఉంది. 24/7 ఆక్సిజన్ పెడుతున్నాడు. నాలుగు రకాల యాంటీబయోటిక్స్ అందిస్తున్నారు. సూదులతో నా చేతులు పుండులా తయారయ్యాయి. కరోనా మీద ప్రభుత్వం చెబుతున్నది కాకమ్మ కథలన్నీ నేను గతంలో చెప్పాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని వెల్లడించాడు.
Read Also: కరోనా కలవరం, బాలు మరణం.. ఈ కారణాలే ఆయన్ని కోలుకోనివ్వలేదా?
‘‘కరోనా వైరస్ అనేది నిజం. ఇది నన్ను చంపేస్తోంది. మీరు ఏదైనా పార్టీలకు వెళ్లేప్పుడు లేదా బయటకు వెళ్లేప్పుడు ఒకసారి ఆలోచించండి. కుర్రాళ్లకు వైరస్ అంటుకోదనే భ్రమతో ఉండేవాడిని. నా వయస్సు 29, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూడండి. మేల్కోండి.. మనకు ఇంకా బోలెడంత జీవితం ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే ఆ జీవితాన్ని చూడగలం. నాలా మరెవ్వరూ తప్పు చేయొద్దు’’ అని క్రిస్ వెల్లడించాడు. చూశారుగా.. ఇప్పటికైనా వైరస్తో జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల మీ కుటుంబాలను సైతం ప్రమాదంలోకి నెట్టకండి. మాస్క్ పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరిగే మూర్ఖుల నుంచి దూరంగా ఉండండి.
క్రిస్ మాట్లాడిన వీడియో ఇదే: