యాప్నగరం

నగరంలో బీపీ, మధుమేహం మగవారికే ఎక్కువట

హైదరాబాద్‌లో ఉన్న ఆడవాళ్లతో పోలిస్తే... మగవారికే టెన్షన్ ఎక్కువట.

TNN 24 Dec 2016, 4:40 pm
హైదరాబాద్‌లో ఉన్న ఆడవాళ్లతో పోలిస్తే... మగవారికే టెన్షన్ ఎక్కువట. ఆ టెన్షన్ వల్ల హైబీపీ, డయాబెటిస్ వంటి రోగాల బారిన పడుతున్నారట. నగరంలో ఉన్న ఆడవాళ్ల కన్నా ఎక్కువమంది మగవారు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్టు, హైపర్ టెన్షన్ గురవుతున్నట్టు నిమ్స్ నివేదికలు తెలిపారు. నిమ్స్ లోని నెఫ్రాలజీ డిపార్ట్ మెంటు వారు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. దాదాపు మూడేళ్ల పాటూ ఈ అధ్యయనం కొనసాగింది. క్రోనిక్ కిడ్నీ డిసీజ్‌కు డయాబెటిస్, హైబీపీల కారణంగా వచ్చే అవకాశం ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. దాదాపు 2,500 మందిపై స్టడీ సాగింది. వారిలో 1250 మంది మగవారు, 1250 మంది ఆడవాళ్లు ఉన్నారు.
Samayam Telugu more men diabetic hypertensive in hyderabad
నగరంలో బీపీ, మధుమేహం మగవారికే ఎక్కువట


అధ్యయనంలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 400 మధుమేహులను విచారించగా వారిలో 70 శాతం మంది మగవారే ఉన్నారు. అలాగే 550 మంది హైబీపీ ఉన్న వారిని సంప్రదించగా వారిలో 60 శాతం మంది మగవారే. అంటే నగరం ఉన్న ఆడవాళ్ల కన్నా మగవారికి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ త్వరగా వచ్చే అవకాశం ఉందన్న మాట.

నగర జనాభాలో 16 శాతం మంది మధుమేహంతో, 22 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారు. వారిలో 8 శాతం మందికి క్రోనిక్ కిడ్నీ సమస్య వచ్చేసింది. ఈ సమస్య వల్ల రక్తంలో వ్యర్థాలు చేరిపోయి కిడ్నీలు దెబ్బతింటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.