యాప్నగరం

పీరియడ్స్ వచ్చాయని పశువుల పాకలో నిద్రిస్తే..

పీరియడ్స్ సమయంలో ఇంట్లోకి రానివ్వకపోవడం.. దేన్నీ తాకనీయకపోవడం లాంటి తరాల క్రితం నాటి ఆలోచనా ధోరణి కారణంగా..

TNN 11 Jul 2017, 4:57 pm
రుతుస్రావం సమయంలో ఇంట్లోకి రాకూడదనే పాత కాలం నాటి ఆచారానికి ఓ యువతి బలైంది. నేపాల్‌లోని పశ్చి దైలేఖ్ జిల్లాకు చెందిన తులసి షాహి అనే 19 ఏళ్ల అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి. ఇప్పటికీ చాలా హిందు కుటుంబాల్లో ఆ నాలుగు రోజులపాటు అమ్మాయిలను వేరుగా ఉంచే ఆచారం ఉంది. అలాగే తులసిని కూడా ఇంటికి సమీపంలోని పశువుల పాకలో ఉంచారు. రాత్రి వేళ పాకలోనే నిద్రిస్తోన్న తులసిని పాము కాటేసింది. దీంతో ‘ఛౌపడి’ అని పిలిచే దురాచారానికి అమాయకురాలైన తులసి బలైంది.
Samayam Telugu nepali teen banished to animal shed for menstruating dies from snakebite
పీరియడ్స్ వచ్చాయని పశువుల పాకలో నిద్రిస్తే..


వాస్తవానికి ఛౌపడి చట్ట విరుద్ధమని నేపాల్ ప్రభుత్వం 2005లోనే తేల్చి చెప్పింది. కానీ ఇప్పటికి రుతుస్రావం సమయంలో ఎంతో మంది అమాయక మహిళలు వన్య ప్రాణులు, పాము కాటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రి వేళలో ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి.

మలినం అనే కారణంతో మన దేశంలోనూ చాలా కుటుంబాల్లో బహిష్టు సమయంలో అమ్మాయిలను, స్త్రీలను ఇలా ఇంట్లోకి రానీయడం లేదు. ఆ సమయంలో నొప్పి, చిరాకుతో ఇబ్బంది పడే వారికి అండగా ఉండాల్సింది పోయి.. ఇంట్లోకి రానివ్వకపోవడం వల్ల వారు మరింత వేదనకు గురవుతున్నారు.

మన దేశంలో కూడా చాలా కుటుంబాల్లో ఇప్పటికీ.. బహిష్టు సమయంలో స్త్రీలను దేన్నీ తాకనివ్వరు. శానిటరీ నాప్‌కిన్స్ వాడకాన్ని ప్రోత్సహించడం, ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి దురవస్థ నుంచి మహిళలను బయటపడేయవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.