యాప్నగరం

డయాబెటిస్ ముప్పు.. ఈ నాలుగే ప్రధాన కారణాలు!

ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా భారత్ మారుతోంది. గత కొన్నేళ్లుగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Samayam Telugu 1 Oct 2018, 1:53 pm
భారతీయులను డయాబెటిస్ ముప్పు భయపెడుతోంది. 30-40 ఏళ్ల వయస్కులు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. కదలకుండా గంటల తరబడి కూర్చోవడం, ఒబేసిటీ, ఒత్తిడి, ఆహార అలవాట్లు, నిద్రలేమి మొదలైనవి డయాబెటిస్ బారిన పడటానికి ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నోయిడాలో శని, ఆదివారాల్లో ఉత్తర ప్రదేశ్ డయాబెటిస్ అసోసియేషన్ 17వ సదస్సు నిర్వహించారు. ఇందులో దేశ రాజధాని ప్రాంతం, ఉత్తర ప్రదేశ్ నుంచి 500 మందికిపైగా డాక్టర్లు పాల్గొన్నారు.
Samayam Telugu diabetis.


‘గత కొన్నేళ్లుగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత్ ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా మారుతోంది’ అని ఈ సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ అమిత్ గుప్తా తెలిపారు. కదలకుండా కూర్చోవడం, ఒత్తిడి పెరగడం, సరిగా నిద్రించకపోవడం, ఆహారం అలవాట్లు డయాబెటిస్‌కు దారి తీస్తున్నాయన్నారు.

శరీరం ఇన్సులిన్‌ స్థాయిలను నియంత్రణలో ఉంచలేకపోవడం వల్ల కణాలు దెబ్బతినడం, అవయవాలు విఫలమవడం లాంటి పరిస్థితి తలెత్తుతుందని డాక్టర్ ఆర్ఆర్ సింగ్, అమితేష్ అగర్వాల్ తెలిపారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి కొత్త ఔషధాలు, వ్యూహాల అవసరం ఉందని వారు చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం డయాబెటిస్ భారత్‌కు ఛాలెంజ్‌గా మారుతోంది. మనదేశంలో డయాబెటిస్ సోకిన వారిలో 8.7 శాతం మంది 20-30 ఏళ్ల మధ్య వయస్కులే కావడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణీకరణ, కూర్చొనే చేసే ఉద్యోగాలు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగాకు వాడకం, ఆయుర్దాయం పెరగడం లాంటివి డయాబెటిస్, ఇతర వ్యాధులు పెరగడానికి కారణం అవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.