యాప్నగరం

పురుగు మందుల ప్రభావంతో వంధ్యత్వం

క్రిమిసంహారక మందుల అవశేషాలు అధిక మోతాదులో ఉన్న ఆహారం తీసుకునేవారిలో సంతాన సంబంధ సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

TNN 31 Oct 2017, 3:44 pm
పురుగు మందుల ప్రభావం ఉన్న ఆహారం తినడం అనార్యోగానికి దారి తీస్తుందనే సంగతి తెలిసిందే. క్రిమిసంహారక మందుల అవశేషాలు అధిక మోతాదులో ఉన్న ఆహారం తీసుకునేవారిలో సంతాన సంబంధ సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాటికి చికిత్స కూడా చాలా కష్టంతో కూడుకుందని చెబుతున్నారు. స్ట్రాబెర్రీలు, పాలకూర తదితర ఆహార పంటల్ని సాగు చేయడానికి పురుగు మందులను అధిక మోతాదులో వాడుతుంటారు. అలాంటి కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగినప్పటికీ పెద్ద తేడా ఉండటం లేదని డాక్టర్ జార్జ్ చావర్రో డెయిలీ మెయిల్‌కు తెలిపారు.
Samayam Telugu study links pesticide exposure to infertility
పురుగు మందుల ప్రభావంతో వంధ్యత్వం


సంతానం కోసం చికిత్స పొందుతున్న మహిళలపై హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయమై అధ్యయనం నిర్వహించారు. అధిక మోతాదులో పురుగు మందుల అవశేషాలు ఉన్న ఆహారం తీసుకునే వారిలో గర్భం దాల్చడంంతోపాటు పిల్లల్నికనే అవకాశాలు తగ్గిపోతున్నట్లు వారు గుర్తించారు.

పురుగు మందులు ప్రభావం సంతానోత్పత్తిపై ఎలా ప్రభావం చూపుతుందనే విషయం మాత్రం పరిశోధకులు స్పష్టతనివ్వలేదు. అబార్షన్ల కారణంగా పిల్లలు సంతానాన్ని పొందడం కష్టం అవుతోంది. ముఖ్యంగా గర్భం దాల్చిన తొలినాళ్లలో ఈ సమస్య అధికంగా ఉంటోందని సదరు నివేదిక స్పష్టం చేసింది. పురుగు మందుల ప్రభావం కారణంగా ఎదుగుతున్న పిండంలో కణాలు చనిపోతున్నాయనే అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.