యాప్నగరం

మెంతులను ఇలా వాడితే షుగర్ ఇట్టే పోతుంది..

మెంతులు.. రోజూ వంటల్లో వాడే మెంతులను వాడడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. వీటిని ఉపయోగించి ఆరోగ్యంగానే కాదు.. అందంగా కూడా తయారవ్వొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Samayam Telugu 23 Jan 2020, 10:47 am
వంటల్లో ఉపయోగించే ఎన్నో పదార్థాలలో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టే మన పూర్వీకులు అనేక ఔషధాలలోనూ వీటిని ఉపయోగించి లాభాలు పొందారు. ఈ నేపథ్యంలోనే మెంతులను ఉపయోగించి ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చో తెలుసుకుందాం..
Samayam Telugu surprising benefits of fenugreek seeds
మెంతులను ఇలా వాడితే షుగర్ ఇట్టే పోతుంది..



​మెంతుల్లోని పోషకాలు..

మెంతుల్లో ఎన్నో పోషకాలు, పీచు పదార్థాలు, ఇనుము, విటమిన్ సి, బి1, బి2 వంటి ఎన్నో ఆరోగ్యానకి సంబంధించిన పదార్థాలు ఉన్నాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకి ఔషధంగా పనిచేస్తాయి.

​అధిక బరువుకు మందుగా..

చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు మెంతులను పెరుగులో రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల ఒంట్లోని అధిక కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం కూడా దూరం అవుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఇలా చేస్తుండాలని చెబుతున్నారు నిపుణులు.

​షుగర్‌ని తగ్గించే మెంతులు..

చాలా మందికి అనేక కారణాల వల్ల డయాబెటీస్ దాడి చేస్తుంది. అలాంటి వారు మెంతులను ఉపయోగించి సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకోసం మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగుతుండాలి.

​బాలింతలకు పాలు..

డెలీవరీ అయిన అనంతరం కొంతమంది మహిళలకి పాలు సరిగ్గా రావు. దీంతో వారికి పుట్టిన పిల్లలకి పాలు పట్టడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారు మెంతులను వాడడం వల్ల బాలింతలకు పాలు బాగా పడతాయి. ఇందుకోసం మెంతులతో కషాయం తాగినా ప్రయోజనం ఉంటుంది. లేదా.. మెంతికూర రోజూ తీసుకున్నా పాలు బాగా పడతాయి. అదే విధంగా మెంతి పిండి, గోధుమ పిండులను సమానపరిమాణంలో నెయ్యిలో ఫ్రై చేసి దానికి సరిపడా పరిమాణంలో పంచదార కలిపి హల్వా చేసి తిన్నా సమస్య త్వరగా తగ్గిపోతుంది.

​జుట్టు సమస్యలకు..

అదే విధంగా చాలా మందికి అనేక కారణాల వల్ల జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటారు. మెంతి ప్యాక్ వేసుకోవడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఇందుకోసం ముందురోజు మెంతులను పెరుగు, మజ్జిగ లేదా నీటిలో నానబెట్టి మరుసటి రోజు దానిని మిక్సీలో పేస్టులా పట్టి దాంతో ప్యాక్ వేయండి. దీని వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది.

​​మొటిమలను తగ్గిస్తుంది..

చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో మొటిమలు ఒకటి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత త్వరగా ప్రభావం కనిపించదు. అలాంటి వారు మెంతి ఆకులను పేస్టు చేసి ముఖానికి ప్యాక్‌లా వేసి ఆరిన తర్వాత నీటితో కడగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే సమస్య చాలా వరకూ తగ్గుతుంది. ముఖంపై మచ్చలు కూడా తగ్గుతుంది. అలా కాకుండా మెంతులను పెరుగులో నానబెట్టి వాటిని పేస్టులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసినా సమస్య చాలా వరకూ తగ్గుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.