యాప్నగరం

పసుపు చాలు.. ఆ మాత్రలేవీ అక్కర్లేదు!

ఏదైనా గాయమైతే వెంటనే పసుపు రాస్తాం. యాంటి సెప్టిక్‌గా పసుపు పని చేస్తుందనే నమ్మకమే దీనికి కారణం. పసుపు వల్ల మరో ప్రయోజనాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు.

TNN 23 Feb 2018, 3:55 pm
పసుపు యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుందని వేలాది ఏళ్ల క్రితమే భారతీయులు గుర్తించారు. అందుకే పొరపాటున ఏదైనా గాయమైతే.. వెంటనే పసుపు రాస్తుంటారు. పసుపు సెప్టిక్ కాకుండా చూడటంతోపాటు గాయాలు వేగంగా మానడానికి తోడ్పడుతుంది. ఇవే కాదు మార్కెట్లో లభించే పెయిన్ కిల్లర్ల కంటే ప్రభావ వంతంగా పసుపు పని చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పసుపులో ఆ రంగుకు కారణమైన కర్‌కమిన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు.
Samayam Telugu turmeric may heal injuries and pain better than painkillers study
పసుపు చాలు.. ఆ మాత్రలేవీ అక్కర్లేదు!


గాయాల బారిన పడిన రగ్బీ ఆటగాళ్లు పసుపు ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందారని ఓ పరిశోధన నిరూపించింది. పసుపు వల్ల మూడు వారాల్లోగానే వీరి గాయాలు మానిపోయాయి. పారాసిటమాల్, ఐబ్రూఫెన్ లాంటి మాత్రల కంటే మిన్నగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పసుపు పని చేసిందని పరిశోధకులు తెలిపారు. శారీరకంగా ఎక్కువగా శ్రమించే క్రీడాకారుల గాయాలను మాన్పడంలో పసుపు ముఖ్య పాత్ర పోషిస్తోందని వారు చెప్పారు.

ఆర్థరైటీస్ పేషెంట్లకు ఇది చక్కటి ఔషధమని, కేన్సర్, గుండె జబ్బులు కూడా పసుపు వల్ల దూరం అవుతాయని చెప్పారు. ఇందుకోసం ఎముకలు, కండర సంబంధ సమస్యలతో బాధపడుతోన్న 50 మంది రగ్బీ ప్లేయర్లపై పరిశోధనలు నిర్వహించారు. పసుపు వల్ల మెమొరీ పవర్ 30 శాతం వరకు పెరుగుతున్నట్లు గతంలో పరిశోధనలు వెల్లడించాయి. డిప్రెషన్ కూడా దూరం అవుతున్నట్లు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.