చనిపోయారనుకున్న మనుషులు.. ఊహించని విధంగా మళ్లీ బతకడం గురించి చాలాసార్లు వినే ఉంటారు. కానీ, వైద్యులే రోగిని చంపేసి.. మళ్లీ బతికించడం గురించి విన్నారా? శరీరంలోని రక్తాన్ని మొత్తాన్ని బయటకు తోడేసి.. కాసేపటి తర్వాత మళ్లీ ఎక్కించి ఆమెకు ప్రాణం పోశారంటే నమ్మగలరా? అయితే, మీరు తప్పకుండా ఈ చికిత్స గురించి తెలుసుకోవల్సిందే.
వాస్తవానికి శరీరంలో రక్తం మొత్తం బయటకు పోతే.. మనిషి చనిపోతాడు. ఆమె కూడా అలాగే చనిపోయింది. అయితే, ఆ రక్తాన్ని వైద్యులే తొలగించడం గమనార్హం. అలా ఎందుకు చేశారో తెలియాలంటే.. ఆమెకు ఏర్పడిన సమస్య గురించి ముందుగా తెలుసుకోవాలి. ఆమె పేరు.. ఇజ్జీ స్కాట్. వయస్సు 23 ఏళ్లు. యార్క్ యూనివర్శిటీలో థియేటర్ కోర్స్ థర్డ్ ఇయర్ చదువుతున్న స్కాట్.. పల్మనరీ హైపర్టెన్షన్ (రక్తపోటు)తో బాధపడుతోంది. దీనివల్ల ఆమె ఊపిరితీత్తుల్లో అధిక రక్తపోటు ఏర్పడి అస్వస్థతకు గురవ్వుతోంది.
‘LADbible’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. స్కాట్కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఊపిరితీత్తుల్లో గడ్డలు (Clots-క్లాట్స్) ఏర్పడినట్లు గుర్తించారు. వాటిని పూర్తిగా తొలగిస్తేగానీ.. ఆమె మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేదని తెలిపారు. అయితే, ఆ క్లాట్స్ను తొలగించడం అంత సులభం కాదు. ఇందుకు ఆమె శరీరంలోని రక్తాన్ని బయటకు తీయాల్సి వస్తుంది. అదే జరిగితే.. ఆమె చనిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో.. వైద్యులు ఆ రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె అంతట ఆమె చనిపోకుండా.. టెక్నికల్గా ఆమెను చంపేసి, తిరిగి బతికించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు.
ప్లాన్ ప్రకారం.. వైద్యులు ఆమె శరీరంలో నుంచి రక్తాన్ని పూర్తిగా తొలగించారు. అంతేగాక శరీరక ఉష్ణోగ్రతను సగానికి తగ్గించారు. దీంతో ఆమె సాంతికేకంగా నిర్జీవంగా మారింది. ఆ వెంటనే వైద్యులు ఊపిరితీత్తుల్లోని క్లాట్స్ మొత్తాన్ని తొలగించారు. అనంతరం ఆమెలోకి రక్తాన్ని ఎక్కించారు. శరీర ఉష్ణోగ్రతను సైతం పెంచారు. దీంతో ఆమె తిరిగి ఊపిరి పీల్చుకోగలిగింది.
ఈ సందర్భంగా బాధితురాలు స్కాట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ ఆపరేషన్ గురించి చెప్పగానే చాలా భయం వేసింది. వాళ్లు నన్ను చంపేసి.. మళ్లీ బతికిస్తానని చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఇది నాలో చాలా ఆందోళన కలిగించింది. ఒక వేళ విఫలమైతే జీవితం ముగిసినట్లే అనిపించింది. కానీ, నేను ఆరోగ్యం ఉండాలంటే ఈ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఆపరేషన్కు ముందు నా వద్ద ఎవరూ లేరు. మూడు రోజులు ఒంటరిగానే ఉన్నాను. నా కుటుంబ సభ్యులతో చివరిగా వీడియో కాల్లో మాట్లాడాను. ఆ ఆపరేషన్ తర్వాత నాలో చాలా మార్పు కనిపించింది. అంతకు ముందు నేను షూ లేస్ కూడా కట్టుకోలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని.. కానీ నేనిప్పుడు అన్ని పనులు చేయగలుగుతున్నా’’ అని తెలిపింది.
Read Also: వీర్యం నాణ్యతకు క్యారెట్ మంచిదా? సంతాన సమస్యలు తొలగుతాయా?
ఈ ఆపరేషన్ను ‘పల్మనరీ ఎండార్టెక్టెక్టోమీ’ (Pulmonary endarterectomy) అంటారని వైద్యులు తెలిపారు. ఆగస్టు నెలలో ‘కోవిడ్-19’ నిబంధనల మధ్య ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆమెను వైద్యులు విజయవంతంగా మళ్లీ బతికించగలిగారు. కానీ, ఆమె మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్ తర్వాత మరో మూడు వారాలు ఆమెను హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉంచారు.
Read Also: శీఘ్ర స్కలనానికి కారణాలేమిటీ? ఈ టెక్నిక్స్ పాటిస్తే.. ‘ఫుల్’ ఎంజాయ్!
స్కాట్ ‘క్రానిక్ థ్రోంబోఎంబాలిక్ పల్మనరీ హైపర్టెన్షన్’ (CTEPH) అరుదైన సమస్యతో బాధపడినట్లు వైద్యులు తెలిపారు. దీనివల్ల ఆమె ఊపిరితీత్తుల్లో రక్తం గడ్డకట్టమే కాకుండా పల్మనరీ ధమనులు కూడా దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. యూకేలో కేవలం 400 మందిలో మాత్రమే ఈ వ్యాధి ఉందని, దీనికి కేవలం కేంబ్రిడ్జ్లోని రాయల్ పాప్వోర్త్లోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. స్కాట్కు కూడా ఈ హాస్పిటల్లోనే చికిత్స అందించారు. ఈ వ్యాధి నుంచి ప్రాణాలతో బయటపడిన నేపథ్యంలో స్కాట్.. దీని గురించి నేటి యువతలో అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించి.. ఈ వ్యాధిని ముందుగానే పసిగట్టేందుకు సహకరిస్తానని ఆమె తెలిపింది.
వాస్తవానికి శరీరంలో రక్తం మొత్తం బయటకు పోతే.. మనిషి చనిపోతాడు. ఆమె కూడా అలాగే చనిపోయింది. అయితే, ఆ రక్తాన్ని వైద్యులే తొలగించడం గమనార్హం. అలా ఎందుకు చేశారో తెలియాలంటే.. ఆమెకు ఏర్పడిన సమస్య గురించి ముందుగా తెలుసుకోవాలి. ఆమె పేరు.. ఇజ్జీ స్కాట్. వయస్సు 23 ఏళ్లు. యార్క్ యూనివర్శిటీలో థియేటర్ కోర్స్ థర్డ్ ఇయర్ చదువుతున్న స్కాట్.. పల్మనరీ హైపర్టెన్షన్ (రక్తపోటు)తో బాధపడుతోంది. దీనివల్ల ఆమె ఊపిరితీత్తుల్లో అధిక రక్తపోటు ఏర్పడి అస్వస్థతకు గురవ్వుతోంది.
‘LADbible’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. స్కాట్కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఊపిరితీత్తుల్లో గడ్డలు (Clots-క్లాట్స్) ఏర్పడినట్లు గుర్తించారు. వాటిని పూర్తిగా తొలగిస్తేగానీ.. ఆమె మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేదని తెలిపారు. అయితే, ఆ క్లాట్స్ను తొలగించడం అంత సులభం కాదు. ఇందుకు ఆమె శరీరంలోని రక్తాన్ని బయటకు తీయాల్సి వస్తుంది. అదే జరిగితే.. ఆమె చనిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో.. వైద్యులు ఆ రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె అంతట ఆమె చనిపోకుండా.. టెక్నికల్గా ఆమెను చంపేసి, తిరిగి బతికించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు.
ప్లాన్ ప్రకారం.. వైద్యులు ఆమె శరీరంలో నుంచి రక్తాన్ని పూర్తిగా తొలగించారు. అంతేగాక శరీరక ఉష్ణోగ్రతను సగానికి తగ్గించారు. దీంతో ఆమె సాంతికేకంగా నిర్జీవంగా మారింది. ఆ వెంటనే వైద్యులు ఊపిరితీత్తుల్లోని క్లాట్స్ మొత్తాన్ని తొలగించారు. అనంతరం ఆమెలోకి రక్తాన్ని ఎక్కించారు. శరీర ఉష్ణోగ్రతను సైతం పెంచారు. దీంతో ఆమె తిరిగి ఊపిరి పీల్చుకోగలిగింది.
ఈ సందర్భంగా బాధితురాలు స్కాట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ ఆపరేషన్ గురించి చెప్పగానే చాలా భయం వేసింది. వాళ్లు నన్ను చంపేసి.. మళ్లీ బతికిస్తానని చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఇది నాలో చాలా ఆందోళన కలిగించింది. ఒక వేళ విఫలమైతే జీవితం ముగిసినట్లే అనిపించింది. కానీ, నేను ఆరోగ్యం ఉండాలంటే ఈ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఆపరేషన్కు ముందు నా వద్ద ఎవరూ లేరు. మూడు రోజులు ఒంటరిగానే ఉన్నాను. నా కుటుంబ సభ్యులతో చివరిగా వీడియో కాల్లో మాట్లాడాను. ఆ ఆపరేషన్ తర్వాత నాలో చాలా మార్పు కనిపించింది. అంతకు ముందు నేను షూ లేస్ కూడా కట్టుకోలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని.. కానీ నేనిప్పుడు అన్ని పనులు చేయగలుగుతున్నా’’ అని తెలిపింది.
Read Also: వీర్యం నాణ్యతకు క్యారెట్ మంచిదా? సంతాన సమస్యలు తొలగుతాయా?
ఈ ఆపరేషన్ను ‘పల్మనరీ ఎండార్టెక్టెక్టోమీ’ (Pulmonary endarterectomy) అంటారని వైద్యులు తెలిపారు. ఆగస్టు నెలలో ‘కోవిడ్-19’ నిబంధనల మధ్య ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆమెను వైద్యులు విజయవంతంగా మళ్లీ బతికించగలిగారు. కానీ, ఆమె మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్ తర్వాత మరో మూడు వారాలు ఆమెను హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉంచారు.
Read Also: శీఘ్ర స్కలనానికి కారణాలేమిటీ? ఈ టెక్నిక్స్ పాటిస్తే.. ‘ఫుల్’ ఎంజాయ్!
స్కాట్ ‘క్రానిక్ థ్రోంబోఎంబాలిక్ పల్మనరీ హైపర్టెన్షన్’ (CTEPH) అరుదైన సమస్యతో బాధపడినట్లు వైద్యులు తెలిపారు. దీనివల్ల ఆమె ఊపిరితీత్తుల్లో రక్తం గడ్డకట్టమే కాకుండా పల్మనరీ ధమనులు కూడా దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. యూకేలో కేవలం 400 మందిలో మాత్రమే ఈ వ్యాధి ఉందని, దీనికి కేవలం కేంబ్రిడ్జ్లోని రాయల్ పాప్వోర్త్లోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. స్కాట్కు కూడా ఈ హాస్పిటల్లోనే చికిత్స అందించారు. ఈ వ్యాధి నుంచి ప్రాణాలతో బయటపడిన నేపథ్యంలో స్కాట్.. దీని గురించి నేటి యువతలో అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించి.. ఈ వ్యాధిని ముందుగానే పసిగట్టేందుకు సహకరిస్తానని ఆమె తెలిపింది.