యాప్నగరం

వామ్మో.. ‘మలేరియా’కు అంత ఖర్చా?

ఆగ్నేయ ఆసియాలో 70 శాతం మలేరియా కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2030 కల్లా దేశాన్ని మలేరియా రహితంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇందుకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.

TNN 13 Dec 2016, 2:01 pm
న్యూఢిల్లీ: ఆగ్నేయ ఆసియాలో 70 శాతం మలేరియా కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2030 కల్లా దేశాన్ని మలేరియా రహితంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇందుకు 18 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే, రూ.1,21,473 కోట్లతో వైద్య సదుపాయాలు, పరిశోధనలు, అవగాహన, నిర్మూలన కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది.
Samayam Telugu war on malaria india needs 18 billion to win battle against malaria
వామ్మో.. ‘మలేరియా’కు అంత ఖర్చా?


ఏడాదికి రూ.13,520 కోట్లు: దేశంలో దయనీయ స్థితిలో ఉన్న పారిశుద్ధ్యం, డ్రైనేజీల వల్ల మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపాదికన నిర్మూలించాలంటే ఏటా రూ.13,520 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. 2000 - 2014 మధ్య 20 లక్షల నుంచి 11 లక్షల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు 7.5 లక్షల కేసులు నమోదు కాగా, 188 మంది చనిపోయారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మలేరియా నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్నాయి. పంజాబ్ ఇప్పటికే మలేరియా ఫ్రీ స్టేట్‌గా గుర్తింపు పొందగా.. తమిళనాడులో ఈ కేసులు 60 శాతానికి తగ్గాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం సత్ఫలితాలు కనిపించడం లేదు.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.