యాప్నగరం

మొలలు లేదా పైల్స్.. ఎలా వస్తాయి? లక్షణాలేమిటీ?

వర్క్ ఫ్రం హోమ్‌.. లేదా ఆఫీసులో కదలకుండా ఒకే చోట కుర్చుంటున్నారా? అయితే, జాగ్రత్త పైల్స్ లేదా మొలలు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఈ మొలలు ఎలా వస్తాయి? లక్షణాలేమిటి?

Samayam Telugu 23 Sep 2020, 2:14 pm
మొలలు.. దీన్నే మూలశంఖ లేదా పైల్స్ అంటారు. మలద్వారం లోపలి భాగంలో ఏర్పడే మొలలు చాలా నొప్పిని కలిగిస్తాయి. ఇవి ముదిరితే.. కుర్చోవడం కూడా కష్టమే. కొందరైతే నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. మరి, ఈ సమస్య ఎందుకు వస్తుంది? మొలలు ఎలా ఏర్పడతాయి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu మొలలు లేదా పైల్స్.. ఎలా వస్తాయి? లక్షణాలేమిటీ?


మొలలు అంటే..?:
మలద్వారం లోపల సున్నితమైన రక్త నాళాలు ఉంటాయి. మూత్రానికి వెళ్లేప్పుడు గట్టిగా ఒత్తిడి చేస్తే.. అవి పిలకల్లా బయటకి వస్తాయి. వాటినే మొలలు లేదా పైల్స్ అంటారు. వైద్య పరిభాషలో దీన్ని హేమోరాయిడ్స్‌గా పరిగణిస్తారు.

మొలలు ఎందుకు వస్తాయి?:
  • ఒకే చోటు ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
  • మానసిక ఒత్తిడి, మద్య సేవనం వల్ల కూడా మొలలు వస్తాయి.
  • నీరు తక్కువగా తాగినా, మాంసాహారం, జంక్ ఫుడ్ అతిగా తిన్నా పైల్స్ వస్తాయి.
  • మలవిసర్జన సమయంలో ఎక్కువగా ముక్కేవారికి మొలలు ఏర్పడతాయి.
  • మలబద్దకం సమస్యతో బాధపడేవారిలోనూ పైల్స్ ఏర్పడవచ్చు.
  • గట్టిగా దగ్గేవారిలో కూడా మొలలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
  • పైల్స్ నీలం, ఎరుపు, తెలుపు, ఊదా రంగులలో ఉంటాయి.
  • మలద్వారంలో ఉండే సున్నితమైన నాళలపై ఒత్తిడి ఏర్పడటం వల్ల అవి వాచిపోయి పిలకల్లా ఏర్పడతాయి. అవి మూత్ర ద్వారానికి అడ్డుగా ఉండి విసర్జన సమయంలో నొప్పి కలిగిస్తాయి.
  • మొలలు వచ్చినప్పుడు నొప్పి మాత్రమే కాకుండా రక్తం కూడా కారుతుంది.
Read Also: డేంజర్ స్ట్రోక్.. పక్షవాతంతో జాగ్రత్త! ఈ లక్షణాలుంటే అప్రమత్తంగా ఉండండి

మొలలు, వాటి లక్షణాలు:

  • మొలలు ఆరంభ దశలో మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. విసర్జన తర్వాత లోపలికి వెళ్లిపోతాయి.
  • రెండో దశలో మొలలు బయటకు వస్తాయి. వాటిని గట్టిగా చేతిలో లోపలికి నెడితేనే లోపలికి వెళ్తాయి.
  • మూడో దశలో మొలలు బయటే ఉండిపోతాయి. ఈ దశలో నొప్పిని భరించడం చాలా కష్టం.
  • ఈ సమస్య తీవ్రమైతే కుర్చోలేరు, నిలబడలేరు కూడా.
  • మల విసర్జన సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. దీని వల్ల నీరసించిపోతారు.
  • రక్తం ఎక్కువగా పోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా వస్తుంది.
  • మొలలు క్యాన్సర్‌కు కూడా దారితీయొచ్చు.
  • మొలలు వచ్చేవారికి కోపం విసుగు ఎక్కువగా వస్తుంది. అందుకే కోపంతో ఊగిపోయేవారిని మూల శంఖ ఉందా అని అంటారు.
Read Also: పసుపు టీ vs అల్లం టీ.. బరువు తగ్గేందుకు ఏది బెటర్?

మొలలు సమస్య ఉంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి:
  • మొలలు వచ్చినవారు శరీరానికి వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • ముఖ్యంగా కారం, మసాలాలు, పచ్చళ్లు, ఊరగాయలు, వేపుళ్లు, చింతపండు, దుంప కూరలకు దూరంగా ఉండాలి.
  • ఈ వ్యాధి సమస్య ఉంటే పీచు ఎక్కువగా ఉండే ఆకు కూరలు, కాయగూరలను ఎక్కువగా తినాలి. (ఆహార నిపుణుల సూచనలు పాటించగలరు.)
  • నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా మొలల సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తపడవచ్చు.
గమనిక: పై లక్షణాలు ఏవి కనిపించినా వైద్యులను సంప్రదించాలని మనవి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.