యాప్నగరం

ఆల్జిమర్స్.. ‘మరపు’ వ్యాధికి మందులేదు, జాగ్రత్త!

ఆల్జిమర్స్.. మతిమరపే కదా అని తక్కువగా చూడకండి. భవిష్యత్తులో మిమ్మల్ని జీవశ్చవంలో మార్చే ప్రమాదకర వ్యాధి ఇది.

Samayam Telugu 21 Sep 2018, 9:34 pm
ల్జిమర్స్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అతి పెద్ద సమస్య ఇది. ఆల్జీమర్స్ వల్ల మతిమరపు ముదిరి మనిషి గతాన్ని పూర్తిగా మరిచిపోతాడు. ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది. ఈ సమస్య మొదలైతే.. పెరగడమే కానీ, తగ్గడం ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మనిషి బతికి ఉన్నా, జీవశ్చవంలా జీవితాన్ని కొనసాగించాల్సిందే.
Samayam Telugu Untitleda


ఆల్జిమర్స్ ఎందుకు వస్తుంది?: ఆల్జిమర్స్ ఎలా వస్తుందో తెలిస్తే జాగ్రత్తపడేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, ఇది ఎప్పుడు, ఎలా ఏర్పడుతుందనడానికి సరైన కారణమే లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.6 కోట్ల మంది ఈ వ్యాధితో బాధడుతున్నట్లు గణంకాలు తెలుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మారుతున్న జీవనశైలి, నిద్రలేమి, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఆల్జిమర్స్ బారిన పడుతున్నారని తెలిసింది. ఇటీవల ఓ పరిశోధనలో తక్కువ సమయం నిద్రపోయేవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొంతమందికి జన్యు సమస్యల వల్ల కూడా ఏర్పడతాయని తెలిపారు. మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలతో బాధపడేవారిలో కూడా ఆల్జిమర్స్ ఏర్పడుతున్నట్లు తెలుపుతున్నారు.
Read Also: ఆల్జీమర్స్.. గజినీలుగా మార్చేసే ఏడు కారణాలు!
మెదడుపై దాడి: మెదడులో ఉండే నాడీ కణాల మధ్య ‘బీటా అమైలాయిడ్‌’ అనే విషతుల్య ప్రోటీన్లు పేరుకుపోతుండటం వల్ల ఆల్జిమర్స్‌ ఏర్పడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నాడీ కణాల మధ్య సమాచార ప్రసారాన్ని ఈ ప్రోటీన్లు అడ్డుకోవడం వల్ల బాధితులకు గతంలో జరిగిన విషయాలను, పదాలను, వ్యక్తులను మరిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బీటా అమైలాయిడ్‌ ప్రోటీన్ల సంఖ్య పెరిగితే కొద్ది వ్యక్తిలో నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. దీన్ని బట్టి నిద్రకు - ఆల్జిమర్స్‌కు చాలా దగ్గర సంబంధం ఉందనే విషయం స్పష్టమవుతోంది.
Read Also: ఆల్జిమర్స్: ఈ ఆహారంతో మెదడుకు ముప్పు!
ఆల్జిమర్స్ వస్తే ఏం జరుగుతుంది?: సాధారణంగా ఈ వ్యాధి 60 ఏళ్లు దాటినవారికి వచ్చేది. కానీ, ఆధునిక కాలంలో ఇది 40 ఏళ్లు దాటినవారిని కూడా ఆవహిస్తోంది. మొదట్లో చిన్న చిన్న విషయాలను మరిచిపోవడంతో ఈ వ్యాధి మొదలవుతుంది. అయితే, ఇది సాధారణమే కదా అని చాలామంది సీరియస్‌గా తీసుకోరు. ఆ తర్వాత వ్యక్తుల పేర్లను మరిచిపోవడం, పదాలు తడబటం మొదలవుతుంది. అది క్రమేనా.. వస్తువులను ఎక్కడ పెట్టామో మరిచిపోవడం, మనుషులను గుర్తుపట్టలేకపోవడం, గతం మరిచిపోవడం, తాము ఎవరితో ఉన్నామో, ఎవరు తమతో ఉన్నారో కూడా తెలుసుకోలేనంతగా మతిమరపు ఏర్పడుతుంది. చివరికి తమ పనులు తాము చేసుకోలేక, ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఆల్జీమర్స్‌కు తగిన మందులేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండటం ఒక్కటే ఉత్తమ మార్గం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.