యాప్నగరం

Navratri 2022 : నవరాత్రుల్లో అమ్మవారికి ఈ ప్రసాదం పెడితే డబ్బుకి లోటు ఉండదట..

Navratri 2022 : నవరాత్రులు ప్రారంభమయ్యాయి. హిందూవుల పవిత్రమైన పండుగ దసరా.. ఈ దసరా నవరాత్రులను చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తాయని నమ్మి ప్రజలు దుర్గా మాతాని పూజిస్తారు. దుర్గమ్మ భక్తులు మహిషాసుర అనే రాక్షసునిపై సాధించిన విజయాన్ని జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. అమ్మవారికి తొమ్మిది రోజుల్లో తొమ్మిది ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మరి ఆ ప్రసాదాలు ఏంటో తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 27 Sep 2022, 4:16 pm

ప్రధానాంశాలు:

  • అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నవరాత్రులు
  • నవరాత్రుల్లో ప్రసాదాలు ఏం పెడితే మంచిదంటే..

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu lord durga puja
దుర్గమ్మ పూజ
ఈ తొమ్మిది రోజులలో అమ్మవారి అవతారాలను పూజిస్తారు. శైలిపుత్రి, బ్రహ్మచారణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రికి ఇలా అమ్మవారి అవతారాలను పూజిస్తారు.
మొదటి రోజు..

నవరాత్రి మొదటిరోజున, భక్తులు దుర్గా అవతారమైన శైలపుత్రిని పూజిస్తారు. వారు శైలపుత్రి దేవి పాదాలకు స్వచ్ఛమైన దేశీ నెయ్యిని సమర్పిస్తారు. స్వచ్ఛమైన నెయ్యి నైవేద్యంగా ప్రజలకు రోగాలు, అనారోగ్యం లేని జీవితాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు.

రెండో రోజు పంచదార..

రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని భక్తులు పూజిస్తారు. బ్రహ్మచారిణి దేవికి పంచదారను సమర్పిస్తారు. ఆమె ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.

Also Read : Birth control : పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏవి వాడితే మంచిదంటే..

3వ రోజు పాయసం..

అమ్మ చంద్రఘంట అవతారంలో అమ్మవారు పూజలు అందుకుంటారు. దుర్గాదేవి ఈ క్రూరమైన అవతారం ఆశీర్వాదం కోసం భక్తులు ఆమె పాయసాన్ని ప్రసాదంగా అందిస్తారు. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతారు.

4 వ రోజు మాల్పూవా

నాల్గవ రోజున కూష్మాండ దుర్గమ్మ భక్తులచే పూజించబడుతుంది. వారు మాల్పూవాని సమర్పిస్తారు. దీంతో సంతోషం కలుగుతుందని భావిస్తారు.

5వ రోజు అరటిపండ్లు

తొమ్మిదో రోజులలో ఐదో రోజున స్కందమాతను పూజిస్తారు. అరటిపండ్లని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని భక్తులు భావిస్తారు.



Also Read : Pancreatic Cancer : వెన్నునొప్పి ఉంటే క్యాన్సర్ ఉన్నట్లేనా..

6 వ రోజు తేనె..

పవిత్రమైన పండుగలో ఆరవ రోజున కాత్యాయని దేవికి తేనెని ప్రసాదంగా సమర్పించొచ్చు.

7వ రోజు బెల్లం

నవరాత్రి ఏడవ రోజున అమ్మవారు కాళరాత్రికి బెల్లంతో తయారు చేసి తీపి పదార్థాలు సమర్పించొచ్చు. బెల్లం అన్నం, బెల్లం పాయసం, బెల్లం గారెలు ఇలా ఏమైనా సమర్పించొచ్చు.

8వ రోజు కొబ్బరి..

దుర్గమ్మ వారు మరో అవతారమైన మహాగౌరి దేవికి కొబ్బరికాయని ప్రసాదంగా ఇవ్వొచ్చు. అష్టమి నాడు బ్రాహ్మణులకు కొబ్బరికాయలు దానం చేయడం వల్ల సంపద, సంతోషం కలుగుతాయని విశ్వసిస్తారు.

Also Read : Anjeer : అంజీర పండ్లని ఇలా తింటే మలబద్ధకం దూరమవుతుందట..

9వ రోజు నువ్వులు..

నవరాత్రి తొమ్మిదవ రోజున భక్తులు సిద్దిదాత్రి అమ్మవారిని పూజిస్తారు. ఆమె ఆశీర్వాదం కోసం ఉపవాసం చేస్తారు. ఈ రోజున అమ్మవారికి నువ్వులు సమర్పించొచ్చు.

ఇలా ఒక్కోరోజు ఒక్కో ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృపకి పాత్రులవ్వాలని భక్తులు నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.