యాప్నగరం

Milk Combinations : పాలతో ఈ బిస్కెట్లు కలిపి తింటే అస్సలు మంచిది కాదట..

Milk Combinations : పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, కొన్నింటితో కలిపి పాలు తీసుకుంటే అది అస్సలు మంచిది కాదని చెబుతున్నారు ఆయుర్వేద డాక్టర్ వరలక్ష్మి. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Produced byరావుల అమల | Samayam Telugu 8 Jul 2023, 12:35 pm
శారీరకంగా ఎదిగేందుకు పాలు చాలా ముఖ్యమైనవి. ఇందులోని కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ పిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకూ అందరకీ అవసరమే. అందుకే ప్రతిరోజూ వీటిని తీసుకోవడం మంచిది. అయితే, చాలా మంది పాలు తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల లాభాల కంట నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Samayam Telugu what should not be eaten with milk according to ayurveda
Milk Combinations : పాలతో ఈ బిస్కెట్లు కలిపి తింటే అస్సలు మంచిది కాదట..


​ఆయుర్వేదం ప్రకారం..

పాల గురించి మాట్లడుతూ ఆయుర్వేద డాక్టర్ వరలక్ష్మీ కొన్ని ఆసక్తికర విషయాల గురించి చెప్పారు. ఈమె ప్రకారం పాలు కొన్ని పదార్థాలతో కలిపి తాగితే విషంలా పని చేస్తాయని చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం పాలు ఓ అద్భుత ఔషధం. కానీ, వాటిని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు.

డాక్టర్ చెబుతున్న విషయాలు..

View this post on Instagram A post shared by Vara Yanamandra (@drvaralakshmi)

​బెల్లం..

నిజానికి పాలల్లో చక్కెర బదులు బెల్లం వేసుకుని తీసుకుంటారు. దీని వల్ల కడుపు క్లీన్ అవుతుందనుకుంటారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటి కలయిక అంత మంచిది కాదు. ఆరోగ్యానికి హానికరం. పాల ప్రభావం చల్లబరిస్తే.. బెల్లం వేడిని పెంచుతుంది. దీంతో కడుపులో సమస్యలు వస్తాయి.

​అరటిపండు..

అరటి పండు, పాలు విడివిడిగా చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు. జిమ్‌కి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా దాదాపు పాలని అరటిపండ్లతో కలిపి షేక్‌లా చేసుకుని తాగుతారు. కానీ, ఇది రెగ్యులర్‌గా ఇలా చేస్తే కఫం వస్తుందని ఇది ఛాతీలో సమస్యలు, జీర్ణ సమస్యలకి కారణమవతుందని డా.వరలక్ష్మీ చెబుతున్నారు.
Also Read : Curry Leaves : కరివేపాకుని ఇలా తింటే షుగర్ ఉన్నవారికి మంచిదట..

​అరటిపండు జ్యూస్

​ఉప్పు..​

చాలా మందికి పాలని తాగడం అస్సలు నచ్చదు. అలాంటప్పుడు సాల్ట్ బిస్కెట్స్ కాంబినేషన్‌తో తీసుకుంటారు. కానీ, ఇవి రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేక గుణాలు కలిగిన ఆహారాలు. ఇవి రెండింటి కలయిక శరీరంలో సమస్యల్ని తీసుకొస్తాయి. అందుకే ఉప్పుతో కలిపిన పదార్థాలతో పాలు తీసుకోవడం మంచిది కాదు.

Also Read : Nail Biting : గోర్లు అదేపనిగా కొరుకుతుంటే ఈ సమస్యలు ఉన్నట్లేనట..

​ఎలా తాగాలి..

ఆయుర్వేదం ప్రకారం పాలని బాగా మరిగించి తాగాలని డాక్టర్ వరలక్ష్మీ చెబుతున్నారు. దీనికి చిటికెడు శొంఠి పొడి కలిపి తాగినా మంచిదే.
​​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​Read More : Relationship News and Telugu New

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.