యాప్నగరం

లాక్ డౌన్ టైమ్‌లో పిల్లలకి నేర్పించాల్సిన ఆన్‌లైన్ కోర్సులు ఇవే..

ఆన్లైన్ క్లాసెస్ లేనప్పుడు టీవీ చూస్తున్నారు, మొబైల్ తో టైమ్‌ గడుపుతున్నారు. సమయం, అంతర్జాల వనరులూ అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఇంకా బాగా వాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Samayam Telugu 28 May 2020, 7:46 pm
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అంతటా విద్యాసంస్థలు మూసివేశారు. విద్యార్దులు ఇళ్లలోనే ఉంటున్నారు. మిగతా సమయం కంటే ఇప్పుడు వాళ్లు కాస్తా ఫ్రీగానే ఉన్నారు. చదువు మధ్యలో ఆగపోకుండా ఉండడం కోసం చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసెస్ మొదలుపెట్టినా కొంతమంది కన్ఫ్యూజన్‌లోనే ఉన్నారు.
Samayam Telugu phone addiction in kids




సెల్ఫ్-స్టడీ

సమయాన్ని సద్వినియోగం చేసుకోడానికి సెల్ఫ్-స్టడీని మించింది లేదు. క్లాస్ లో చెప్పిన విషయాలని రివైండ్ చేసుకోవడానికి గానీ, కొన్ని వర్క్ షీట్స్ చేసుకోవడానికి గానీ ఇది సరైన సమయం. అప్పుడు వచ్చిన సందేహాలను తర్వాత క్లాస్ లో తీర్చుకోడానికి ఇది సరైన అవకాశం. ఇవన్నీ విద్యార్ధులకి కొత్తేమీ కాదు. స్కూల్స్ నడుస్తున్నప్పుడు అందరూ చేసినవే. అయితే అలవాటు తప్పకుండా చూసుకోవడం అవసరం. ఆన్లైన్ క్లాసెస్‌తో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులని అధిగమించడానికి ఇది చక్కటి పద్ధతి.

Also Read : లో దుస్తులు లేకుండా పడుకుంటే ఏమవుతుందో తెలుసా..

ఆన్‌లైన్ కోర్సులు

ఏదైనా ఒక ఆన్‌లైన్ కోర్స్ లో చేరడానికి ఇది సరైన సమయం. ఈ కోర్స్ వాళ్ళ చదువుకు సంబంధించినదే కానకర్లేదు. ఏదైన ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు. కొత్త హాబీని పరిచయం చేసుకోవచ్చు. లేదా ఉన్న హాబీకే పదును పెట్టుకోవచ్చు. ఇప్పుడు చేతిలో సమయం ఉంది కాబట్టి నేర్చుకున్న ఈ నైపుణ్యం ఎప్పుడైనా అవసరంపడొచ్చు..

Also Read : సూపర్బ్ హెయిర్ బ్యూటీ టిప్‌ని షేర్ చేసిన ప్రియాంక చోప్రా..

ముందే చదువుకోవడం

విద్యాసంస్థలన్నీ ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాయి. కాబట్టి, వాళ్ళ వనరులన్నీ కూడా ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా చర్చించవలసిన విషయాలని ముందే చూసుకోడంవల్ల ఆ విషయం చర్చకు వచ్చినప్పుడు విద్యార్ధులు తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు. ఇంకా ఈ లాక్ డౌన్ సమయం పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే విద్యార్ధులకి ఎంతో ఉపయోగం. రోజూ, కాలేజీకీ, స్కూలుకీ వెళ్ళి వచ్చే రోజుల్లో కన్నా ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువ సమయం చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.


పుస్తక పఠనం

ఫిక్షన్ కానివ్వండి, నాన్ ఫిక్షన్ కానివ్వండి పుస్తకపఠనం ఎప్పుడూ మంచిదే. విద్యార్ధులెప్పుడూ మామూలు పుస్తకాలు చదవడానికి సమయం సరిపోవట్లేదు అంటూ ఉంటారు. ఈ లాక్ డౌన్ సమయాన్ని అందుకు ఉపయోగించుకుంటే ఉత్సాహంగా కూడా ఉంటుంది. పాఠాలు చదువుకోవడం, పుస్తకాలు చదవడం - ఈ రెండిటి మధ్యా సమతూకం సాధించగలిగితే ఈ సమయాన్ని సార్ధకం చేసుకున్నట్లే. చాలా పుస్తకాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. హాయిగా చదువుకోండి.

Also Read : హార్ట్ పేషెంట్స్‌కి మేలు చేసే వర్కవుట్స్.. మరెన్నో లాభాలు కూడా..

ఆరోగ్యం విషయంలో..

ఈ లాక్ డౌన్ అందరి మీదా ఏదో ఒక రకమైన ప్రభావం చూపిస్తోంది. ఇది విద్యార్ధుల మీద మరీ ఎక్కువగా ఉంది. వారు ఆందోళనకు గురి కాకుండా చూస్కోవాలి. కుటుంబంతో సమయం ఎక్కువగా గడపడం, స్నేహితులతో సామాజిక మాధ్యమాల ద్వారా కబుర్లు చెప్పుకోవడం కొంత ప్రశాంతతని కలుగచేస్తాయి. వారు ఈ సమయం లో ధైర్యంగా ఉండడం చాలా అవసరం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.