యాప్నగరం

ఆ మాయలో పడి.. ఆమెతో ‘టచ్’ మిస్సవుతున్నారు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారా..? ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఫోన్‌తో గడిపేస్తున్నారా..?

Samayam Telugu 11 Jun 2018, 7:44 pm
మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? ఉదయాన్నే లేవగానే వాట్సాప్‌తో మొదలుపెట్టి, రాత్రి పడుకునేప్పుడు ఫేస్‌బుక్‌తో రోజును ముగిస్తున్నారా..? అందర్నీ కలవడం కుదరడం లేదు కాబట్టి సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్నామని ఫీలవుతున్నారా..? టచ్‌లో ఉంటున్న మాట నిజమే కానీ మీరు అసలు ‘టచ్’ను మిస్సవుతున్నారు. ఇది మేం చెబుతోంది కాదు. ఎంతో అనుభవం ఉన్న 90 ఏళ్ల సెక్స్ థెరపిస్ట్ డాక్టర్ రుత్ వెస్థీమెర్ చెబుతున్న మాటలివి.
Samayam Telugu sm


సోషల్ మీడియా నేటి తరం రొమాంటిక్ రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతోందని డాక్టర్ రుత్ చెబుతున్నారు. పక్కనున్న వ్యక్తితో కలవకపోవడం, ఫోన్‌తోనే బిజీగా ఉండటం వల్ల ఒంటరిగా మిగులుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ప్రపంచం పుణ్యామని మనుషుల సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని ఆమె వాపోయారు.

‘ఎదుటి వ్యక్తితో మాట్లాడే కళను నేటి తరం కోల్పోతోంది. నిత్యం ఫోన్లతో బిజీగా ఉంటున్నారు. రెస్టారెంట్‌కు జంటగా వెళ్లినప్పుడు కూడా పార్టనర్‌తో సరదాగా గడపాల్సింది పోయి ఫోన్లతో గడిపేస్తున్నారు. ఇది రిలేషన్‌షిప్స్‌లో అతిపెద్ద సమస్య. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయం ఇంటర్నెట్‌తో వాడండ’ని ఆమె సూచిస్తున్నారు. ఇలా ఒంటరిగా గడపడం వల్ల మానసిక సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.