జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ రెండు కొత్త కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ముడుచుకునే మెత్తని టాప్స్తో కూడిన రెండు మోడళ్లు సీ300 కేబ్రియోలెట్, ఎస్500 కేబ్రియోలెట్లను భారత్లో అందుబాటులోకి తెచ్చింది. సీ300 ధర రూ. 60 లక్షలు కాగా, పెద్ద కారు ఎస్500 ధర రూ. 2.25 కోట్లు (రెండూ ఢిల్లీ ఎక్స్ షోరూం ధరలు). ఈ కొత్త కార్లతో భారత్లో లభిస్తున్న సీ క్లాస్ కార్ల సంఖ్య నాలుగుకు పెరగగా, ఎస్ క్లాస్ వేరియంట్ల సంఖ్య మూడుకు పెరిగింది.
2.0 లీటర్ ఫోర్ పాట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో సీ300 లభిస్తోంది. అన్ని సీ క్లాస్ కార్లలోలానే దీనిలో కూడా రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. అలాగే కార్ సాఫ్ట్ టాప్ రూఫ్ కూడా కేవలం 20 సెకెన్లలో ముడుచుకుంటుంది. అయితే ఎస్500 కేబ్రిలియోట్లో 4.7 లీటర్ల ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది అత్యధికంగా 455పీఎస్ పవర్ను 700ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
2.0 లీటర్ ఫోర్ పాట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో సీ300 లభిస్తోంది. అన్ని సీ క్లాస్ కార్లలోలానే దీనిలో కూడా రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. అలాగే కార్ సాఫ్ట్ టాప్ రూఫ్ కూడా కేవలం 20 సెకెన్లలో ముడుచుకుంటుంది. అయితే ఎస్500 కేబ్రిలియోట్లో 4.7 లీటర్ల ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది అత్యధికంగా 455పీఎస్ పవర్ను 700ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.