యాప్నగరం

​ ముంబయి ప్చ్.. ఢిల్లీ టార్గెట్ 143

లేని పరుగు కోసం ప్రయత్నించి బట్లర్ రనౌటవగా.. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (8), రోహిత్ శర్మ (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్

TNN 22 Apr 2017, 9:57 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో తొలిసారి ముంబయి బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ జోస్ బట్లర్ (28: 18 బంతుల్లో 3x4, 2x6), పొలార్డ్ (26: 29 బంతుల్లో 4x4), హార్దిక్ పాండ్య (24: 23 బంతుల్లో 2x6) మాత్రమే ఫర్వాలేదనిపించారు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన రబాడ తన రెండో ఓవర్‌లోనే పార్థీవ్ పటేల్(8)‌ని క్లీన్ బౌల్డ్ చేసి అరంగ్రేటంని ఘనంగా చాటుకున్నాడు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న బట్లర్ దూకుడుగా ఆడటంతో ముంబయి మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది.
Samayam Telugu mi vs dd 25th match ipl live score
​ ముంబయి ప్చ్.. ఢిల్లీ టార్గెట్ 143


కానీ.. లేని పరుగు కోసం ప్రయత్నించి బట్లర్ రనౌటవగా.. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (8), రోహిత్ శర్మ (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. దీంతో ముంబయి ఒకానొక దశలో 60/4తో ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో సహనంతో ఆడిన క్రునాల్ పాండ్య (17: 16 బంతుల్లో 1x4), పొలార్డ్‌తో కలిసి కాసేపు ఇన్నింగ్స్ నడిపించినా అతడ్ని స్పిన్నర్ అమిత్ మిశ్రా పెవిలియన్‌కి పంపించేశాడు. చివర్లో హార్దిక్ పాండ్య బ్యాట్ ఝళిపించడంతోనే ముంబయి కనీసం 142 పరుగులైనా చేయగలిగింది. దిల్లీ బౌలర్లలో కమిన్స్, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు తీయగా.. రబాడ ఒక వికెట్ తీశారు. బట్లర్, హర్భజన్ సింగ్, హార్దిక్ పాండ్య రనౌట్ రూపంలో వెనుదిరగడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.