యాప్నగరం

బెంగళూరు తడ‘బ్యాటు’..ముంబయి టార్గెట్ 163

కోహ్లి ఔట్ అనంతరం వచ్చిన ఏబీ డివిలియర్స్ తానాడిన తొలి నాలుగు బంతుల్లోనే ఒక ఫోర్, సిక్స్ బాది తన ఉద్దేశాన్ని

TNN 1 May 2017, 5:45 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (20: 14 బంతుల్లో 2x6), మన్‌దీప్ సింగ్ (17: 13 బంతుల్లో 3x4) నిలకడగా ఆడటంతో బెంగళూరు 3.3 ఓవర్లలోనే 31 పరుగులతో మెరుగ్గా కనిపించింది. కానీ..ఈ దశలో స్పిన్నర్ క్రునాల్ పాండ్య క్రీజులో తడబడుతున్న మన్‌దీప్ సింగ్‌‌ని బుట్టలో వేయగా.. మరో 9 పరుగుల వ్యవధిలోనే మెక్లనగాన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి కూడా ఔటైపోయాడు.
Samayam Telugu mi vs rcb mumbai indians target 163
బెంగళూరు తడ‘బ్యాటు’..ముంబయి టార్గెట్ 163


కోహ్లి ఔట్ అనంతరం వచ్చిన ఏబీ డివిలియర్స్ (43: 27 బంతుల్లో 3x4, 3x6) తానాడిన తొలి నాలుగు బంతుల్లోనే ఒక ఫోర్, సిక్స్ బాది తన ఉద్దేశాన్ని చాటాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని ఈ హిట్టర్ భారీ షాట్లు ఆడటంతో బెంగళూరు మళ్లీ కోలుకుంది. ట్రావిస్ హెడ్ (12: 15 బంతుల్లో 1x4) కూడా ఏబీకి చక్కటి సహకారం అందించాడు. కానీ.. మరోసారి క్రునాల్ పాండ్య బెంగళూరును తన బౌలింగ్‌తో దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన క్రునాల్ బౌలింగ్‌లో తొలి బంతినే సిక్స్‌గా మలిచిన డివిలియర్స్.. తర్వాత బంతికి కూడా భారీ షాట్ కోసం ప్రయత్నించి ఫీల్డర్ బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో ఆ జట్టు భారీ స్కోరు ఆశలు వదులుకుంది. మధ్యలో వాట్సన్ (3) నిరాశపరిచినా.. చివర్లో పవన్ నేగి (35: 23 బంతుల్లో 1x4, 3x6), కేదార్ జాదవ్ (28: 22 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించడంతో బెంగళూరు 162 పరుగులు చేయగలిగింది. ముంబయి బౌలర్లలో మెక్లనగాన్ మూడు వికెట్లు తీయగా.. క్రునాల్ పాండ్య రెండు, కర్ణ్ శర్మ, బుమ్రా చెరో వికెట్ తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.