యాప్నగరం

వాంఖడేలో ముంబయి టార్గెట్ 161

తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టిన రహానె - త్రిపాఠి జోడి తొలి వికెట్‌కి 9.3 ఓవర్లలోనే 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

TNN 24 Apr 2017, 9:42 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో ముంబయి ఇండియన్స్ బౌలర్ల జోరు కొనసాగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ని 160/6కే ముంబయి బౌలర్లు కట్టడి చేసేశారు. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి (45: 31 బంతుల్లో 3x4, 2x6), అజింక్య రహానె (38 : 32 బంతుల్లో 5x4, 1x6) ఆదిలోనే దూకుడుగా ఆడి పుణెకి శుభారంభమిచ్చినా.. ఆ జట్టు మిడిలార్డర్ విఫలమైంది. తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టిన రహానె - త్రిపాఠి జోడి తొలి వికెట్‌కి 9.3 ఓవర్లలోనే 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడిని విడదీసేందుకు ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ పదేపదే బౌలర్లు మార్చినా పదో ఓవర్ వరకూ ఫలితం రాబట్టలేకపోయాడు.
Samayam Telugu mi vs rps 28th match ipl live score
వాంఖడేలో ముంబయి టార్గెట్ 161


సాఫీగా సాగుతున్న పుణె ఇన్నింగ్స్‌కి రహానెని ఔట్ చేయడం ద్వారా కర్ణ్ శర్మ బ్రేక్‌లేశాడు. బంతిని అంచనా వేయడంలో తడబడిన రహానె బౌలర్ శర్మకే క్యాచ్‌కి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (17: 12 బంతుల్లో 2x4) నిలకడగా ఆడినా.. స్పిన్నర్ హర్భజన్ అద్భుత బంతితో అతడ్ని బోల్తా కొట్టించేశాడు. అంతకముందు ఓవర్‌లోనే కర్ణ్ శర్మ కూడా త్రిపాఠిని పెవిలియన్‌కి పంపడంతో పుణె 104/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న బెన్ స్టోక్స్ (17: 12 బంతుల్లో 2x4), ధోని (7: 11 బంతుల్లో) స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో ఔటైపోయారు. చివర్లో మనోజ్ తివారీ (22: 13 బంతుల్లో 4x4) ఫర్వాలేదనిపించడంతో పుణె 160 పరుగులైనా చేయగలిగింది. ముంబయి బౌలర్లలో కర్ణ్ శర్మ, బుమ్రా చెరో వికెట్లు తీయగా.. మిచెల్ జాన్సన్, హర్భజన్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.