మైదానంలో తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్న ధోనీ ఐదు మ్యాచ్ల్లో చేసింది 61 పరుగులే. దీంతో మునుపటిలా ధోనీ టీ20ల్లో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడంటూ తీవ్ర స్థాయిలో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై స్పందించిన షేన్ వార్న్.. ఎవరి కోసం.. ఎవరి ముందూ ధోనీ తన సత్తా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
‘క్రికెట్లోని అన్ని ఫార్మాట్లో మహేంద్రసింగ్ ధోని అద్భత నైపుణ్యమున్న ఆటగాడు. అంతకంటే మించి గొప్ప కెప్టెన్.. స్ఫూర్తి ప్రదాత. అతను ఎవరి ముందు తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని సామాజిక మాధ్యమాల ద్వారా షేన్వార్న్ వివరించాడు. సాధారణంగా స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్కి వచ్చే ధోని వరుస సిక్సర్లతో విరుచుకుపడుతూ జట్టు స్కోరును అమాంతం పెంచేవాడు. కానీ.. ఈ సీజన్లో ధోనీ ఐదు మ్యాచ్ల్లో కలిపి కొట్టిన సిక్సర్లు రెండే కావడం విశేషం. టోర్నీకి కొద్ది రోజుల ముందే రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫ్రాంఛైజీ ధోనీని జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
‘క్రికెట్లోని అన్ని ఫార్మాట్లో మహేంద్రసింగ్ ధోని అద్భత నైపుణ్యమున్న ఆటగాడు. అంతకంటే మించి గొప్ప కెప్టెన్.. స్ఫూర్తి ప్రదాత. అతను ఎవరి ముందు తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని సామాజిక మాధ్యమాల ద్వారా షేన్వార్న్ వివరించాడు. సాధారణంగా స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్కి వచ్చే ధోని వరుస సిక్సర్లతో విరుచుకుపడుతూ జట్టు స్కోరును అమాంతం పెంచేవాడు. కానీ.. ఈ సీజన్లో ధోనీ ఐదు మ్యాచ్ల్లో కలిపి కొట్టిన సిక్సర్లు రెండే కావడం విశేషం. టోర్నీకి కొద్ది రోజుల ముందే రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫ్రాంఛైజీ ధోనీని జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.