యాప్నగరం

ప్రపంచంలోనే తొలి 5జీ మొబైల్ వచ్చేసింది

బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ జెడ్‌టీఈ ప్రపంచంలోనే తొలి 5జీ కంపాటిబుల్ మొబైల్‌ను ప్రదర్శించింది

TNN 28 Feb 2017, 7:02 am
బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ జెడ్‌టీఈ ప్రపంచంలోనే తొలి 5జీ కంపాటిబుల్ మొబైల్‌ను ప్రదర్శించింది. ‘గిగాబిట్’ పేరుతో వ్యవహరించే ఈ ఫోన్ ద్వారా ఒక సెకన్లోనే 1 జీబీ డేటాను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ సేవల కంటే ఇది పది రెట్లు అధికం కావడం విశేషం. ఇందులో 360 డిగ్రీల పనోరమిక్ వర్చువల్ రియాలిటీ వీడియో, హైఫై మ్యూజిక్, వీడియోలను అత్యంత వేగంతో డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ పరికరంతో.. ప్రజల మధ్య అనుసంధానత మరింతగా పెరగనుందని, మేం 5జీ టెక్నాలజీ మీద దృష్టి పెట్టనున్నామని జెటీఈ అధికార ప్రతినిధి ప్రకటించారు.
Samayam Telugu mwc 2017 zte launches worlds first 5g enabled smartphone
ప్రపంచంలోనే తొలి 5జీ మొబైల్ వచ్చేసింది


5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఫోన్ల రూపకల్పనపై ఇతర సంస్థలు కూడా దృష్టి సారిస్తున్నాయి. 2018లో పియాంగ్‌చాంగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దక్షిణ కొరియాకు చెందిన కేటీకార్ప్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో వీటిని ప్రదర్శించినప్పటికీ వినియోగంలోకి రావడానికి మరికొన్ని ఏళ్లు పట్టే అవకాశం ఉంది. 2020 నాటికి 5జీ టెక్నాలజీ సేవలు వాణిజ్యపరంగా విస్తృతంగా వాడుకలోకి రానున్నాయని అంచనా.

జెటీఈ సంస్థను 1985లో ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 160కిపైగా దేశాల్లో మొబైల్ పరికరాలు, సేవలను అందిస్తోంది. అమెరికా మార్కెట్లో 10 శాతం వాటా ఉన్న ఏకైక చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ ఇదే కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.