కర్ణాటక ఎన్నికలను 2019లో జరిగే ఎన్నికలకు ‘మినీ సంగ్రామం’గా దేశం భావిస్తోంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ల తీర్పు ఏవిధంగా ఉండబోతుందనే ఉత్కంఠత నెలకొంది. ఇప్పటివరకు సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నా.. త్రిశంకు సమరం తప్పకపోవచ్చని తెలుస్తోంది. కన్నడ నాట బీజేపీ కూడా ఊపులో ఉన్న నేపథ్యంలో తుది తీర్పుపై ఆసక్తి నెలకొంది.
50 స్థానాల్లో త్రిశంకు సమరం:
224 విధానసభ నియోజకవర్గాల్లో 222 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. నకిలీ ఓటు కార్డులు వెలుగుచూసిన రాజరాజేశ్వరి నగర నియోజకవర్గ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. జయనగర బీజేపీ అభ్యర్థి విజయకుమార్ మరణంతో ఆ ఎన్నిక రద్దయ్యింది. ఎన్నికల్లో మొత్తం 50 స్థానాల్లో త్రిశంకు సమరం తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్లు ఒంటరిగానే పోరాడుతున్న నేపథ్యంలో ఎవరికీ పూర్తి మెజారిటీ లభించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో జేడీఎస్ కింగ్ మేకరయ్యే అవకాశం లేకపోలేదు.
మూడు పార్టీలకూ ఈ ఎన్నికలు పెద్ద సవాల్!:
2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని కైవశం చేసుకుంటూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీంతో కర్ణాటక ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019 ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని చూపేందుకు ఈ ఎన్నికలే కీలకమనే పరిస్థితి నెలకొంది. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. త్వరలో రాజస్థాన్, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్లలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోడానికి విజయం తప్పనిసరి.
దక్షిణ భారతంలోనూ పాగా వేయాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ కూడా కర్ణాటకలో విజయం సాధించేందుకు చాలా పట్టుదలగా ఉంది. ఓటమి ఈ పార్టీపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. కాంగ్రెస్ ఆ అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు జేడీఎస్ కూడా విజయం కోసం పరితపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ల పోరులో ఈ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ప్రధాన పార్టీలకు మెజారిటీ రాకపోతే.. జేడీఎస్ ‘కింగ్ మేకర్’గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
హిస్టరీ రిపీట్?:
1985 నుంచి నేటి వరకు కర్ణాటకలో ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాకపోవడం గమనార్హం. మరి, కాంగ్రెస్ పార్టీ ఆ రికార్డును చెరిపేయనుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సారి తమ విజయం పక్కా అనే ధీమాలో బీజేపీ ఉంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లతో విజయం సాధిస్తే 1985 నాటి చారిత్ర పునరావృతమైనట్లే. మరి ఈ 33 ఏళ్ల సాంప్రదాయాన్ని యడ్యూరప్ప అధిగమిస్తారో లేదో చూడాలి.
50 స్థానాల్లో త్రిశంకు సమరం:
224 విధానసభ నియోజకవర్గాల్లో 222 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. నకిలీ ఓటు కార్డులు వెలుగుచూసిన రాజరాజేశ్వరి నగర నియోజకవర్గ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. జయనగర బీజేపీ అభ్యర్థి విజయకుమార్ మరణంతో ఆ ఎన్నిక రద్దయ్యింది. ఎన్నికల్లో మొత్తం 50 స్థానాల్లో త్రిశంకు సమరం తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్లు ఒంటరిగానే పోరాడుతున్న నేపథ్యంలో ఎవరికీ పూర్తి మెజారిటీ లభించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో జేడీఎస్ కింగ్ మేకరయ్యే అవకాశం లేకపోలేదు.
మూడు పార్టీలకూ ఈ ఎన్నికలు పెద్ద సవాల్!:
2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని కైవశం చేసుకుంటూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీంతో కర్ణాటక ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019 ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని చూపేందుకు ఈ ఎన్నికలే కీలకమనే పరిస్థితి నెలకొంది. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. త్వరలో రాజస్థాన్, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్లలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోడానికి విజయం తప్పనిసరి.
దక్షిణ భారతంలోనూ పాగా వేయాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ కూడా కర్ణాటకలో విజయం సాధించేందుకు చాలా పట్టుదలగా ఉంది. ఓటమి ఈ పార్టీపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. కాంగ్రెస్ ఆ అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు జేడీఎస్ కూడా విజయం కోసం పరితపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ల పోరులో ఈ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ప్రధాన పార్టీలకు మెజారిటీ రాకపోతే.. జేడీఎస్ ‘కింగ్ మేకర్’గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
హిస్టరీ రిపీట్?:
1985 నుంచి నేటి వరకు కర్ణాటకలో ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాకపోవడం గమనార్హం. మరి, కాంగ్రెస్ పార్టీ ఆ రికార్డును చెరిపేయనుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సారి తమ విజయం పక్కా అనే ధీమాలో బీజేపీ ఉంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లతో విజయం సాధిస్తే 1985 నాటి చారిత్ర పునరావృతమైనట్లే. మరి ఈ 33 ఏళ్ల సాంప్రదాయాన్ని యడ్యూరప్ప అధిగమిస్తారో లేదో చూడాలి.