స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుకు సంతానం ఇద్దరి కంటే ఎక్కువగా ఉండరాదని ఎన్నికల కమిషన్ నిబంధనలున్నాయి. ఈ విషయంలో ఓ మహిళా నేత నిజంగానే అదృష్టవంతురాలు. ముందు సర్పంచ్ అయ్యారు. రోజుల వ్యవధిలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహిస్తున్నారు. తొలి విడత 21వ తేదీన, రెండో విడత ఎన్నికలు 25న జరిగాయి. మూడో విడత పోలింగ్ 30న జరగనుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నెలో తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గువ్వలదిన్నె సర్పంచ్గా పోటీచేసిన మహాదేవి విజయం సాధించారు. ఆమె ఈనెల 27న ఓ పాపకు జన్మనిచ్చారు. ఇదివరకే ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఆమె గర్భంతో ఉన్నప్పటికీ.. ఎన్నికలు జరిగే సమయానికి ఆమెకు సంతానం ఇద్దరే ఉండటంతో పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎన్నికల తరువాత మూడో కాన్పు కావడంతో సర్పంచ్గా ఆమె ఎన్నిక చెల్లుతుందని అధికారులు తెలిపారు.
గ్రామ సర్పంచ్గా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాననని మహాదేవి అన్నారు. ప్రజాసేవ చేసే అదృష్టం ఉన్న కారణంగానే ఎన్నికల తర్వాత మూడో బిడ్డకు జన్మనిచ్చానని హర్షం వ్యక్తం చేశారు. ఓవైపు ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించడం, మరోవైపు మూడో బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు.
గ్రామ సర్పంచ్గా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాననని మహాదేవి అన్నారు. ప్రజాసేవ చేసే అదృష్టం ఉన్న కారణంగానే ఎన్నికల తర్వాత మూడో బిడ్డకు జన్మనిచ్చానని హర్షం వ్యక్తం చేశారు. ఓవైపు ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించడం, మరోవైపు మూడో బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు.