యాప్నగరం

ఇది కూడా ఐపీఎల్ స్పెషలే!

క్రికెట్ ప్రేమికులు దాదాపు 45 రోజులుగా ఐపీఎల్ మత్తులో తూలుతున్న విషయం తెలిసిందే.

TNN 19 May 2017, 7:48 pm
క్రికెట్ ప్రేమికులు దాదాపు 45 రోజులుగా ఐపీఎల్ మత్తులో తూలుతున్న విషయం తెలిసిందే. పొట్టి క్రికెట్‌తో అన్ని దేశాల క్రికెటర్లు మెరుగైన అవకాశాలతో పాటు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. నిర్వాహకులకు కూడా పెద్ద మొత్తంలో లాభాలు వస్తుండటంతో ఏడాదికేడాది ఈ టోర్నీకి మరిన్ని హంగూ ఆర్బాటాలు అద్దుతున్నారు. మరోవైపు సందట్లో సడేమియా అన్నట్లుగా బెట్టింగులతోనూ కొంత మంది భారీగానే వెనకేసుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. మ్యాచ్‌లు వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకుల నుంచి కొంత మంది వ్యాపారులు భారీగా దండుకుంటున్నారు. కొన్ని పదార్థాలపై ఏకంగా ఎంఆర్పీ రేటుకు 50 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆడియన్స్ కూడా అంతే మొత్తం చెల్లిస్తున్నారు.
Samayam Telugu overpriced food still a trouble in stadiums of ipl tourney
ఇది కూడా ఐపీఎల్ స్పెషలే!


ఎంఆర్పీపై అధిక రేటుకు వస్తువులను అమ్మకూడదంటూ ఎన్ని నిబంధనలు ఉన్నా.. ఇలాంటి వారికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో తనిఖీ చేసిన అధికారులకు విస్తూపోయే వాస్తవాలు తెలిశాయి. రూ. 75 విలువైన ఐస్ క్రీంను రూ. 100కు పైగా, రూ. 20 విలువైన మంచినీళ్ల బాటిల్‌ను రూ. 30 నుంచి 40 వరకూ అమ్మేస్తున్నారు. లీగల్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ అధికారులు సదరు వ్యాపారులపై కేసు నమోదు చేశారు.

ఇలాంటి ఉదంతాలపై ఓ కన్నేసి ఉంచాలంటూ.. బీసీసీఐకి గతంలోనే సూచించినట్లు అధికారులు గుర్తు చేశారు. కానీ, పట్టించుకునే నాథుడే లేడు. ఐపీఎల్ పుణ్యమా అని అందరూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.. ఎటొచ్చీ సామాన్యుడి జేబుకే చిల్లు.
Read this in Marathi

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.