యాప్నగరం

​ఐపీఎల్ లో ఆడకపోవడంపై పాక్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఐపీఎల్ వంటి టీ20 మెగా టోర్నీలో ఆడకపోవడం వల్ల ఆధునిక క్రికెట్ లో పాక్ ప్లేయర్లు వెనుకబడిపోయారని

TNN 14 Apr 2017, 10:36 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వకపోవడంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు కాసుల వర్షంలో తడిసి ముద్దయ్యే ఐపీఎల్ లో పాక్ ప్లేయర్లకు కూడా ఛాన్స్ ఇవ్వాలని బాలీవుడ్ ప్రముఖుడు రిషికపూర్ కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్ లో పాక్ ప్లేయర్లు పాల్గొన్నారు. అయితే ఆ వెంటనే ముంబై పై పాక్ ఉగ్రవాదుల దాడితో.. భారత్ పాక్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను తెంచుకుంది. ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్లపై అప్రకటిత నిషేధం ఏర్పడింది.
Samayam Telugu pakistan need to embrace modern cricket
​ఐపీఎల్ లో ఆడకపోవడంపై పాక్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!


ఆ తర్వాత పలుదఫాలుగా.. పాక్ ప్లేయర్లకు ఐపీఎల్ లో అవకాశం కల్పించడం గురించి పాక్ మాజీల నుంచే విజ్ఞప్తులు వచ్చాయి. అయితే బీసీసీఐ వాటిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ జాతీయ జట్టు కోచ్ మికీ ఆర్థర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడితే బాగుంటుందని ఆర్థర్ అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ వంటి టీ20 మెగా టోర్నీలో ఆడకపోవడం వల్ల ఆధునిక క్రికెట్ లో పాక్ ప్లేయర్లు వెనుకబడిపోయారని ఆర్థర్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ అనుభవం లేక ఈ తరం క్రికెట్ లో దూకుడు, వేగాన్ని వారు ఏ మాత్రం అందుకోలేకపోతున్నారని అయన అన్నారు. ఐపీఎల్ అనుభవం ఆటగాళ్లపై చాలా మంచి ప్రభావం చూపిస్తోందని, కేవలం అంతర్జాతీయ టీ20ల్లోనే గాక, వన్డే మ్యాచ్ లలో కూడా ప్లేయర్లు దూకుడుగా ఆడటానికి ఐపీఎల్ కారణం అవుతోందని ఆర్థర్ విశ్లేషించారు.

వన్డేల్లో చివరి పది ఓవర్లలో వంద పరుగులు చేయడం చాలా సులభం అయిపోయింది చాలా జట్లకు. అయితే పాక్ మాత్రం ఇంకా బంతికో పరుగు అనే సమీకరణం మీదే ఆడుతోంది అని ఆ జట్టు కోచ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్లనే చాలా మ్యాచ్ లలో పాక్ ఓడిపోతోందని ఆర్థర్ అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.