భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ పేమెంట్స్ యాప్ పేటీఎంకి ఐఫోన్ యూజర్ల కోసం కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. ఆపిల్ స్టోర్లో ఉన్న పేటీఎం యాప్లో క్లిష్టమైన బగ్ ఒకటి ఉన్నట్లు గుర్తించిన కంపెనీ దాన్ని సరిచేసి కొత్త యాప్ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. తమ ఐఓఎస్ యాప్ ద్వారా వినియోగదారులు ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయారని, యాప్ అదేపనిగా హ్యాంగ్ అవుతున్నట్లు గుర్తించామని కంపెనీ తెలిపింది. ఈ క్లిష్టమైన బగ్ను ఫిక్స్ చేసి పేటీఎం 5.8.2 అప్డేట్ను ఆపిల్ స్టోర్లో అందుబాటులో ఉంచామని కంపెనీ ప్రకటించింది.
ఈ మేరకు ఆపిల్ స్టోర్లో ఉన్న పేటీఎం యాప్ వద్ద ‘క్రిటికల్ బగ్ ఫిక్స్. ప్లీజ్ అప్డేట్ యువర్ యాప్ ఇమీడియట్లీ’ అని డిస్క్రిప్షన్ కూడా రాసి ఉంది. నిజానికి బగ్ కారణంగా బుధవారం ఆపిల్ స్టోర్ నుంచి తన యాప్ను పేటీఎం తొలగించింది. బగ్ను సరిచేసిన తరవాత అప్డేట్ను గురువారం అందుబాటులోకి తెచ్చింది.
ఈ మేరకు ఆపిల్ స్టోర్లో ఉన్న పేటీఎం యాప్ వద్ద ‘క్రిటికల్ బగ్ ఫిక్స్. ప్లీజ్ అప్డేట్ యువర్ యాప్ ఇమీడియట్లీ’ అని డిస్క్రిప్షన్ కూడా రాసి ఉంది. నిజానికి బగ్ కారణంగా బుధవారం ఆపిల్ స్టోర్ నుంచి తన యాప్ను పేటీఎం తొలగించింది. బగ్ను సరిచేసిన తరవాత అప్డేట్ను గురువారం అందుబాటులోకి తెచ్చింది.