యాప్నగరం

పేటీఎం కొత్త బాదుడు.. తప్పించుకోండిలా

క్రెడిట్ కార్డుల వినియోగంపై డిజిటల్ వాలెట్ పేటీఎం మళ్లీ అదనపు ఫీజు మొదలుపెట్టింది.

TNN 9 Mar 2017, 2:13 pm
క్రెడిట్ కార్డుల వినియోగంపై డిజిటల్ వాలెట్ పేటీఎం మళ్లీ అదనపు ఫీజు మొదలుపెట్టింది. అంటే క్రెడిట్ కార్డులు ఉపయోగించి పేటీఎం వాలెట్‌లో మనీ యాడ్ చేస్తే 2 శాతం అదనపు ఫీజు పడుతుంది. మోదీ ప్రభుత్వం డీమానిటైజేషన్‌ను తీసుకొచ్చిన తరవాత డిజిటల్ లావాదేవీలను పెంచడానికి, చిన్న వ్యాపారులను ఆకర్షించడానికి పేటీఎం ఈ అదనపు ఫీజును ఇప్పటి వరకు ఎత్తేసింది. అలాగే వాలెట్ నుంచి నగదును తమ బ్యాంక్ అకౌంట్‌కు పంపినా అదనపు ఫీజు వసూలు చేయలేదు. కానీ ఇప్పుడు వాటిని పేటీఎం మళ్లీ మొదలుపెట్టింది.
Samayam Telugu paytm levies new fee heres how to avoid it
పేటీఎం కొత్త బాదుడు.. తప్పించుకోండిలా


అయితే వాలెట్‌లోని క్రెడిట్ కార్డులతో నగదు యాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ అదనపు ఫీజు ఉంటుంది. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా వాలెట్‌ను నింపితే ఎలాంటి అదనపు ఫీజులు ఉండవు. పేటీఎం యూజర్లు క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరిపితే వాటిని అందిస్తున్న బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్కులు తమ వద్ద నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయని పేటీఎం బ్లాగు ద్వారా వెల్లడించింది. వినియోగదారుడు చాలా సులభంగా పేటీఎం వాలెట్‌లో క్రెడిట్ ద్వారా నగదు జమచేసి, దాన్ని మళ్లీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల తమకు నష్టం కలుగుతోందని పేర్కొంది.

అందుకనే మార్చి 8 నుంచి మళ్లీ 2 శాతం అదనపు ఫీజును తీసుకొచ్చామని వివరించింది. అయితే క్రెడిట్ ద్వారా పేటీఎంలో మొబైల్ రీచార్జ్, షాపింగ్, టికెట్ బుకింగ్స్ చేసినప్పుడు ఎలాంటి అదనపు ఫీజులు ఉండవు. కేవలం వాలెట్‌లోకి నగదు జమచేసినప్పుడు మాత్రమే ఫీజు ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.