మార్చి నెలలో జన్మించిన సెలబ్రిటీలు, దిగ్గజాలు, ప్రముఖుల వివరాలు మీకోసం..
2/20
జాకీర్ హుస్సేన్: మార్చి 9
తబాలా వాయిద్యకారుడైన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న జన్మించాడు. 1998లో ఆయనకు పద్మశ్రీ లభించింది. 2002లో పద్మభూషణ్ వరించింది. 1990లో సంగీత్ నాటక్ అవార్డును గెలుచుకున్నారు.
3/20
పార్థీవ్ పటేల్: మార్చి 9
టీమిండియా క్రికెటర్ పార్థీవ్ పటేల్ మార్చి 9, 1985న జన్మించాడు. 2002లో ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు ద్వారా 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా పార్థీవ్ (17 ఏళ్ల 153 రోజులు).. పాకిస్థాన్కు చెందిన హనీఫ్ మహ్మద్ (17 ఏళ్ల 300 రోజులు) రికార్డును బ్రేక్ చేశాడు. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతోపాటు.. ధోనీ భారత జట్టులోకి రావడంతో టీమిండియాకు దూరమయ్యాడు.
8 ఏళ్ల తర్వాత గానీ పార్థీవ్కు మళ్లీ టెస్టు క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. 2016 నవంబర్ 23న సాహా స్థానంలో ఇంగ్లాండ్తో సిరీస్కి పార్థీవ్కు పిలుపు అందింది. మొహాలీ టెస్టులో ఆడిన పార్థివ్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మధ్య కాలంలో భారత్ 83 టెస్టులు ఆడటం గమనార్హం. వన్డేల్లోనూ ద్రావిడ్ వికెట్ కీపర్గా పని చేయడంతో పార్థీవ్కు పెద్దగా అవకాశాలు రాలేదు.
4/20
నిమ్మ రాజి రెడ్డి: మార్చి 9
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన నిమ్మ రాజిరెడ్డి 1937 మార్చి 9న జన్మించారు. 1962లో వెల్దండ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1978 నుంచి 21 ఏళ్లపాటు చేర్యాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాక ఆ పార్టీలో చేరిన ఆయన వరుసగా విజయాలు సాధించారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో జౌళి శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో టీడీపీలో చీలికలు వచ్చిన సమయంలో ఆయన ఎన్టీఆర్ వైపు మొగ్గారు. చంద్రబాబు వర్గంలో చేరడానికి నిరాకరించారు.
దీంతో 1999 ఎన్నికల్లో చంద్రబాబు రాజిరెడ్డికి టికెట్ ఇవ్వలేదు. నాటి నుంచి 2009లో చేర్యాల నియోజకవర్గం జనగామలో విలీనం అయ్యేంత వరకు అక్కడ టీడీపీ మళ్లీ గెలవలేదు.
తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆయన తర్వాత టీఆర్ఎస్కు మద్దుతుగా నిలిచారు. 2004లో ఏప్రిల్లో రాజిరెడ్డితోపాటు మరో ఇద్దరు నేతలను చంద్రబాబు పార్టీ నుంచి బహిష్కరించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం పట్ల రాజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై వ్యతిరేకతతో కాంగ్రెస్లో చేరిన ఆయన జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2009 అక్టోబర్ 19న 72 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించారు.
రాజస్థాన్ మాజీ సీఎం అయిన వసుంధర.. సింథియా మరాఠా రాజకుటుంబంలో 1953 మార్చి 8న జన్మించారు. తమిళనాడులోని కొడైకెనాల్లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ దివంగత నేత మాధవరాజే సింథియా ఆమె సోదరుడు. 1985లో ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-2003 మధ్య ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2003 డిసెంబర్ 8న రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమె 2013 డిసెంబర్ 8న తిరిగి రాజస్థాన్ సీఎం అయ్యారు. 2018 డిసెంబర్ 7న జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ ఓడటంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.
6/20
అనుపమ్ ఖేర్: మార్చి 7
అనుపమ్ ఖేర్: కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన అనుపమ్ ఖేర్ 1955 మార్చి 7న షిమ్లాలో జన్మించారు.
7/20
శర్వానంద్: మార్చి 6
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శర్వానంద్ 1984 మార్చి 6న జన్మించాడు. హైదరాబాద్లో జన్మించిన ఆయన వెస్లీ డిగ్రీ కాలేజీలో బీకాం చదివాడు. చిరంజీవితో థమ్స్ అప్ యాడ్లో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐదవ తారీఖుతో తెలుగు సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. చిరంజీవితో కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్లో నటించాడు. సంక్రాంతి, లక్ష్మీ చిత్రాల్లో వెంకటేష్తో కలిసి నటించాడు. అందరి బంధువయా, గమ్యం, ప్రస్థానం, నువ్వా నేనా, రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు తదితర చిత్రాలతో తనేంటో నిరూపించుకున్నాడు. రామ్ చరణ్, రానా ఇతడికి క్లాస్ మేట్స్. శర్వానంద్ సోదరుడు రామ్ పోతినేని సోదరిని పెళ్లాడాడు.
8/20
వరలక్ష్మీ శరత్ కుమార్: మార్చి 5
శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మీ పోడా పోడీ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. నటుడు విశాల్తో కొన్నాళ్లు ఆమె ప్రేమాయణం సాగించారనే వార్తలొచ్చాయి.
9/20
శివరాజ్ సింగ్ చౌహాన్: మార్చి 5
బీజేపీ ఉపాధ్యక్షుడైన శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా 2005 నుంచి 2018 వరకు పని చేశారు. సీఎంగా మధ్యప్రదేశ్పై చెరగని ముద్ర వేశారు. 1991-2006 మధ్య విదిశ ఎంపీగా పని చేశారు. 1972లో 13 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా చేరారు. 2018 చివర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని బీజేపీ స్వల్ప తేడాతో కాంగ్రెస్కు అధికారాన్ని కోల్పోయింది. ఆయన 1959 మార్చి 5న జన్మించారు.
10/20
నాజర్: మార్చి 5
దక్షిణాది నటుడైన నాజర్ తమిళనాడులోని చెంగళపట్టులో జన్మించారు. తెలుగులోనూ అనేక చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ఆయన తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం, అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. 1985లో బాలచందర్ డైరెక్షన్లో కళ్యాణ అగతిగల్ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మణిరత్నం, కమల్ హసన్ చిత్రాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
11/20
శ్రద్ధా దాస్: మార్చి 4
శ్రద్ధా దాస్ ముంబైలోని బెంగాలీ కుటుంబంలో జన్మించింది. సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్య2, డార్లింగ్, పీఎస్వీ గరుడ వేగ తదితర చిత్రాల్లో నటించింది.
12/20
కమలినీ ముఖర్జీ: మార్చి 4
కోల్కతాకు చెందిన కమలినీ ముఖర్జీ శేఖర్ కమ్ముల సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆనంద్, గోదావరి, గమ్యం, గోపీ గోపికా గోదావరి, నాగవల్లి, విరోధి లాంటి చిత్రాల్లో ఆమె నటించారు.
13/20
చంద్రశేఖర్ యేలేటి: మార్చి 4
దర్శకుడైన చంద్రశేఖర్ యేలేటి మార్చి 4, 1973న తునిలో జన్మించారు. ఐతే సినిమాతో నంది అవార్డు గెలుపొందారు. అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి చిత్రాలను తీశారు.
14/20
రోహన్ బోపన్న: మార్చి 4
కర్ణాటకకు చెందిన బోపన్న భారత టెన్నిస్ ప్లేయర్. 2010లో యూఎస్ ఓపెన్ డబుల్స్లో ఖురేషితో కలిసి రన్నరప్ సాధించాడు. మిక్స్డ్ డబుల్స్లో సానియాతో కలిసి ఆడాడు.
15/20
శ్రద్ధా కపూర్: మార్చి 3
శ్రద్ధా కపూర్ మార్చి 3, 1987న ముంబైలో జన్మించింది. ఆషిఖీ2 సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ‘సాహో’లో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
16/20
శంకర్ మహదేవన్ : మార్చి 3
మ్యూజిక్ కంపోజర్, సింగర్ అయిన శంకర్ మహదేవన్ 1963 మార్చి 3న ముంబైలోని తమిళ్ అయ్యర్ ఫ్యామిలీలో జన్మించారు. సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్లను గెలుచుకున్నారు.
17/20
జంషెడ్జీ టాటా: మార్చి 3
భారత తొలితరం పారిశ్రామిక వేత్త అయిన జంషెడ్జీ టాటా 1839 మార్చి 3న బరోడా సమీపంలోని నవ్సారీలో పార్శీ కుటుంబంలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జంషెడ్జీని భారత పారిశ్రామిక రంగ పితామహుడిగా పిలుస్తారు. ఆయనకు జీవితంలో నాలుగు లక్ష్యాలు ఉండేవి. ఐరన్ స్టీల్ కంపెనీ ఏర్పాటు, ప్రపంచ స్థాయి విద్యాసంస్థ, అతిపెద్ద హోటల్, జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. కానీ ముంబైలో తాజ్ మహల్ హోటల్ను మాత్రమే ఆయన నిర్మించగలిగారు. 1903లో దీని నిర్మాణం పూర్తయ్యింది. భారత్లో ఎలక్ట్రిసిటీ ఉన్న తొలి హోటల్ అది.
తర్వాత ఆయన వారసులు ఆయన కలలను నెరవేర్చారు. జంషెడ్జీ వారసులు టాటా స్టీల్ను ఏర్పాటు చేశారు. ఆసియాలోనే తొలి స్టీల్ కంపెనీ అది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద స్టీల్ కంపెనీగా ఇది అవతరించింది.
బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూల్ ఆఫ్ సైన్స్లు టాటాలే ఏర్పాటు చేశారు. జంషెడ్జీ లక్ష్యానికి అనుగుణంగా టాటా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ సప్లయ్ కంపెనీ కూడా ఏర్పాటైంది. తర్వాత దాన్ని టాటా పవన్ కంపెనీ లిమిటెడ్గా మార్చారు. ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ రంగంలో ఉన్న అతిపెద్ద ఎలక్ట్రిసిటీ కంపెనీ ఇది. వ్యాపార పని నిమిత్తం జర్మనీ వెళ్లిన జంషెడ్జీ 1904 మే 19న మరణించారు. ఇంగ్లాండ్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
18/20
నితీశ్ కుమార్ : మార్చి 1
నితీశ్ కుమార్ బిహార్లోని భక్తిపూర్లో 1951 మార్చి 1న జన్మించారు. ఎన్ఐటీ పాట్నా నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. బిహార్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డులో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి చేరారు. కేంద్రంలో రైల్వే మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా పని చేశారు. 2010లో బిహార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత బిహార్ సీఎం ఆయనే.
19/20
ఎంకే స్టాలిన్: మార్చి 1
స్టాలిన్ తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమారుడు. కరుణానిధి మరణం తర్వాత డీఎంకే బాధ్యతలను చేపట్టారు. కరుణానిధి రెండో భార్య దయాళు అమ్మాల్కు 1953 మార్చి 1న జన్మించారు.
20/20
మేరీ కోమ్ - మార్చి 1
భారత మహిళా బాక్సర్ అయిన మేరికోమ్ మార్చి 1, 1983న మణిపూర్లో జన్మించారు. వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను ఆరుసార్లు గెలుపొందిన ఏకైక మహిళా బాక్సర్ మేరీకోమ్. పిల్లలు పుట్టాక కూడా ఆమె బాక్సింగ్లో సత్తా చాటాడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్ కూడా ఆమె కావడం విశేషం. 2016లో రాష్ట్రపతి ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. ‘మేరీకోమ్’ పేరిట బయోపిక్ కూడా వచ్చింది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.