పెదరాయుడు, దేవీ' వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశాడు.. ఈ పిల్లోడు. 3 ఏళ్లకే యాక్టింగ్ మొదలెట్టేసి 150కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా చేశాడు.. మహేంద్రన్. ఇంకా తెలుగులో 'పెళ్లి చేసుకుందాం, ఆహా, లిటిల్ హార్ట్స్, సింహాద్రి' లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మెరిశాడు. తమిళ్లో ఎప్పుడో హీరోగా మొదలెట్టినా..
'తెలుగులో మాత్రం 'అసలు ఏం జరిగిందంటే' అనే చిత్రంతో మనల్ని పలకరించనున్నాడు. శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.. మహేంద్రన్కు.