డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'అర్జున'. అందాల భామ మరియం జకారియా కథానాయిక. కన్మణి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ తన పాత్రలలో నట విశ్వరూపం చూపించారటా. ప్రస్తుత రాజకీయ నేపథ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదని చిత్రబృందం తెలిపింది.