'నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు సరసన నటించి తెలుగుప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైన ఈ సుందరి మళ్ళీ 'ఆదిపురుష్' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ భారీ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది.