యాప్నగరం

ధోనీ v/s బుమ్రా మళ్లీ ఫైట్..!

క్వాలిఫయర్ మ్యాచ్‌‌ని తలపిస్తూ ధోనీ భారీ షాట్లు ఆడతాడని అభిమానులు ఆశించారు. కానీ.. అప్పటికే 12 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసిన ధోని

TNN 22 May 2017, 6:15 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో ఇద్దరు భారత క్రికెటర్ల మధ్య అత్యంత ఆసక్తికరమైన పోరు నడిచింది. గ్రేట్ మ్యాచ్ ఫినిషర్‌గా ఇప్పటికే నిరూపించుకున్న మహేంద్రసింగ్ ధోని(పుణె), డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా (ముంబయి) ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు టోర్నీ చివరి వరకూ ప్రయత్నించారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో ఒకసారి ధోనీ ఆధిపత్యం చెలాయించగా.. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో బుమ్రా విజేతగా నిలిచి మ్యాచ్‌ని ముంబయి వైపు తిప్పాడు. వాంఖడేలో జరిగిన క్వాలిఫయర్ -1 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో కళ్లుచెదిరే రీతిలో రెండు సిక్సర్లు బాదేసిన ధోనీ 15 పరుగులు రాబట్టాడు. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య పోరు అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తించింది.
Samayam Telugu pl final 2017 ms dhoni taking on jasprit bumrah and other key battles which could decide title
ధోనీ v/s బుమ్రా మళ్లీ ఫైట్..!


పుణె విజయానికి 24 బంతుల్లో 33 పరుగులు చేయాలి. క్రీజులో కెప్టెన్ స్టీవ్‌స్మిత్, ధోనీ ఉండటంతో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ పేసర్ బుమ్రాకి బంతినిచ్చాడు. క్వాలిఫయర్ మ్యాచ్‌‌ని తలపిస్తూ ధోనీ భారీ షాట్లు ఆడతాడని అభిమానులు ఆశించారు. కానీ.. అప్పటికే 12 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసిన ధోని కొంచెం ఒత్తిడిలో కనిపించాడు. ఆ ఓవర్ రెండో బంతిని ఆఫ్ స్టంప్‌కి దగ్గరగా గుడ్ లెంగ్త్ రూపంలో బుమ్రా విసరగా.. ధోనీ పాయింట్ దిశగా కట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి బ్యాట్ ఎడ్జ్‌ని తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ చేతిలో పడింది. దీంతో బుమ్రా గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు. ఆ ఓవర్‌లో ధోనీ వికెట్ తీసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పుణె‌పై ఒత్తిడి పెరిగిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.