మెహుల్ చోక్సి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్ మోదీ తర్వాత అత్యంత కీలక నిందితుడు. ఇప్పుడు పీఎన్బీ కేసులో ఆయన్ను విచారించాలని సీబీఐ ప్రయత్నిస్తుంటే సీబీఐకి రాసిన లేఖలో నేను విచారణకు రాలేనని చెప్పారు. గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు వ్యతిరేకంగా ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు.
చోక్సీ సీబీఐకి రాసిన లేఖలో "నా పాస్ పోర్ట్ రద్దు చేశారు. ముంబయి ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పాస్పోర్టును ఎందుకు రద్దు చేసిందో తెలపలేదు. దేశ భద్రతకు నేను ఏ విధంగా ముప్పు కలగజేస్తానో వెల్లడించలేదు.'' అని చెప్పారు.
''నాకున్న ఆరోగ్య సమస్య కారణంగా నేను ప్రస్తుతం ప్రయత్నం చేయలేను. ఫిబ్రవరి మొదటి వారంలో గుండె చికిత్స చేశారు. దానికి సంబంధించి ఇంకా కొంత వైద్యం పెండింగ్లో ఉంది.'' అని చోక్సీ అన్నారు.
చోక్సి, వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ వంటి పలువురు పీఎన్బీ కేసు నిందితులను ఈడీ విచారిస్తోంది. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ వంటివి ఒక్కొక్కటిగా విచారణలో నిమగ్నమయ్యాయి. పీఎన్బీ కేసు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రూ.12,000 కోట్లు ఆర్థిక మోసం జరిగిన దానిలో పలువురు ఉద్యోగులు, బ్యాంకు అధికారులు ఈ కేసులో సంబంధం ఉన్న పలువురు ముఖ్యులను ఈడీ, సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ ఈ కేసుకు సంబంధించి రూ.6000 కోట్లమేర ఆస్తులను జప్తు చేసింది.
చోక్సీ సీబీఐకి రాసిన లేఖలో "నా పాస్ పోర్ట్ రద్దు చేశారు. ముంబయి ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పాస్పోర్టును ఎందుకు రద్దు చేసిందో తెలపలేదు. దేశ భద్రతకు నేను ఏ విధంగా ముప్పు కలగజేస్తానో వెల్లడించలేదు.'' అని చెప్పారు.
''నాకున్న ఆరోగ్య సమస్య కారణంగా నేను ప్రస్తుతం ప్రయత్నం చేయలేను. ఫిబ్రవరి మొదటి వారంలో గుండె చికిత్స చేశారు. దానికి సంబంధించి ఇంకా కొంత వైద్యం పెండింగ్లో ఉంది.'' అని చోక్సీ అన్నారు.
చోక్సి, వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ వంటి పలువురు పీఎన్బీ కేసు నిందితులను ఈడీ విచారిస్తోంది. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ వంటివి ఒక్కొక్కటిగా విచారణలో నిమగ్నమయ్యాయి. పీఎన్బీ కేసు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రూ.12,000 కోట్లు ఆర్థిక మోసం జరిగిన దానిలో పలువురు ఉద్యోగులు, బ్యాంకు అధికారులు ఈ కేసులో సంబంధం ఉన్న పలువురు ముఖ్యులను ఈడీ, సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ ఈ కేసుకు సంబంధించి రూ.6000 కోట్లమేర ఆస్తులను జప్తు చేసింది.