యాప్నగరం

ఆర్‌కాం నుంచి భారత తొలి 4జీ ల్యాండ్‌లైన్ ఫోన్

భారత తొలి 4జీ వీఓఎల్టీఈ ఆండ్రాయిడ్ వైర్‌లెస్ ల్యాండ్‌లైన్ ఫోన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ శుక్రవారం విడుదలచేసింది.

TNN 11 Nov 2016, 6:39 pm
భారత తొలి 4జీ వీఓఎల్టీఈ ఆండ్రాయిడ్ వైర్‌లెస్ ల్యాండ్‌లైన్ ఫోన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ శుక్రవారం విడుదలచేసింది. సిమ్ కార్డు సదుపాయంతో వస్తోన్న ఈ ఫోన్ ఇతర డివైజ్‌లకు వైఫై హాట్‌స్పాట్‌గాను పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు మరో ఎనిమిది డివైజన్‌లను ఒకేసారి అనుసంధానం చేసుకోవచ్చని రిలయన్స్ చెపుతోంది. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 3.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది.
Samayam Telugu rcom launches indias first 4g volte enabled android landline phone
ఆర్‌కాం నుంచి భారత తొలి 4జీ ల్యాండ్‌లైన్ ఫోన్


ఈ ఫోన్‌తో పాటు 4జీ స్మార్ట్ లైఫ్ 299, 4జీ స్మార్ట్ లైఫ్ 499 ప్లాన్‌లను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇవి వరసగా రూ. 299, రూ. 499లకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. 299 ప్లాన్‌లో 2జీబీ డాటా ఆఫర్ చేయగా, 499 ప్లాన్‌లో 4జీబీ డాటా వస్తోంది. రెండు ప్లాన్‌లలో అత్యధికంగా 300 నిమిషాలు (ఎస్టీడీ, లోకల్) వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఉచిత నిమిషాలు అయిపోయిన తరవాత నిమిషానికి 40 పైసలు చార్జ్ పడుతుంది. ఇక ఎస్‌ఎంఎస్ విషయానికొస్తే.. లోకల్ 25 పైసలు, ఎస్టీడీకి 38 పైసలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.