యాప్నగరం

బెజవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం తరఫున బెజవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు.. ఆంధ్ర రాష్ట్రాన్ని చల్లగా చూడమని దుర్గమ్మను ప్రార్థించానన్న సీఎం.

Samayam Telugu 14 Oct 2018, 6:55 pm
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కొండపైకి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందజేసి.. అమ్మవారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు. చంద్రబాబుతో పాటూ నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు.
Samayam Telugu Babu1


ఆంధ్ర రాష్ట్రాన్ని చల్లగా చూడమని దుర్గమ్మను ప్రార్థించానన్నారు చంద్రబాబు. సకాలంలో వర్షాలు కురిపించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌తో పాటూ అన్ని నదుల అనుసంధానం జరగాలని కూడా ప్రార్ధించానన్నారు. విజయవాడను ఆధ్యాత్మిక కేంద్రంగా.. మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.