యాప్నగరం

ధ్యానమనో ప్రస్థానంలో 18న దసరా వేడుకలు

ధ్యానమనో ప్రస్థానంలోని విశ్వచైతన్య వేదికపై జరిగే ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి.గౌరీశంకర్, జయ జయ శంకర ఛానెల్ సీఈవో ఓలేటి పార్వతీశం ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

Samayam Telugu 16 Oct 2018, 6:37 pm
ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న ధ్యానమనో ప్రస్థానంలో అక్టోబర్ 18న దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. సైన్స్ యూనివర్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నట్లు అధ్యక్షులు ఎస్.రాజేంద్ర వెల్లడించారు. ఈ దసరా వేడుకలకు అందరూ ఆహ్వానితులే అన్నారు. దసరా వేడుకల్లో భాగంగా గురు విశ్వస్ఫూర్తి విరచిత ‘ది నోట్ బుక్’ గ్రంథావిష్కరణ కూడా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మహా ప్రసాదం వరకు ఈ దసరా వేడుకలు జరుగుతాయి.
Samayam Telugu -


ధ్యానమనో ప్రస్థానంలోని విశ్వచైతన్య వేదికపై జరిగే ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి.గౌరీశంకర్, జయ జయ శంకర ఛానెల్ సీఈవో ఓలేటి పార్వతీశం ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. దసరా వేడుకల్లో భాగంగా ‘ది నోట్ బుక్’ గ్రంథావిష్కరణతో పాటు సామూహిక ధ్యానం, ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, పేదలకు వస్త్ర దానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.