యాప్నగరం

ధ్యానమనో ప్రస్థానమ్‌లో ఘనంగా దసరా వేడుకలు

వేడుకల్లో భాగంగా సామూహిక ధ్యానం, ఉచిత వైద్య శిబిరం, పేదలకు వస్త్రదానం, పుస్తక ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Samayam Telugu 18 Oct 2018, 10:07 pm
ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న ధ్యానమనో ప్రస్థానమ్‌లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దసరా వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి విరచిత ‘ది నోట్ బుక్’ గ్రంథావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి.గౌరీశంకర్, జయ జయ శంకర ఛానెల్ సీఈవో ఓలేటి పార్వతీశం ముఖ్య అతిథులుగా హాజరై ‘ది నోట్ బుక్’ గ్రంథావిష్కరణ చేశారు.
Samayam Telugu spoorthi4

అలాగే వేడుకల్లో భాగంగా సామూహిక ధ్యానం, ఉచిత వైద్య శిబిరం, పేదలకు వస్త్రదానం, పుస్తక ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సైన్స్ యూనివర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఆ సంస్థ అధ్యక్షులు ఎస్.రాజేంద్ర అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తులకు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య సందేశాన్ని అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.