యాప్నగరం

Dhantrayodashi 2022 ధన్వంతరి ఎవరు? తనను ధన త్రయోదశి రోజునే ఎందుకు పూజిస్తారో తెలుసా...

Dhantrayodashi 2022 ధన్వంతరి ఎవరు? తనను ధన త్రయోదశి రోజునే ఎందుకు ఆరాధించాలి.. తనను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 18 Oct 2022, 2:56 pm
Dhantrayodashi 2022 ధన త్రయోదశి రోజున బంగారం, వెండి లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే విషయంలో మనలో చాలా మందికి తెలుసు. ఎందుకంటే ధన్వంతరికి, కుభేరుడికి ఈరోజు చాలా ఇష్టమైన రోజు. అందుకే వీరిద్దరికీ ధంతేరాస్ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల తమ సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి తమ ఇంట్లో నివాసం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా.. ఇప్పటితరం వారిలో చాలా మందికి ధన్వంతరి గురించి తెలియదు. ఈ సందర్భంగా ధన్వంతరి ఎవరు? తనను ధన త్రయోదశి రోజునే ఎందుకు ఆరాధించాలి.. తనను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu dhantrayodashi 2022 know about who is lord dhanvantari and why worshipped on dhanteras in telugu
Dhantrayodashi 2022 ధన్వంతరి ఎవరు? తనను ధన త్రయోదశి రోజునే ఎందుకు పూజిస్తారో తెలుసా...


ధన్వంతరి ఎవరంటే..

పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు సాగర మథనం చేస్తున్నప్పుడు త్రయోదశి రోజున విష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకుని కనిపించాడు. అదే రోజున ధన్వంతరి పుట్టినరోజుగా భావిస్తారు. అప్పటినుంచి ప్రతి ఏటా ధన్వంతరి జయంతి సందర్భంగా తనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

Dhantrayodashi 2022 ధన త్రయోదశి రోజున ఈ ఆలయాలను దర్శించుకుంటే.. మీ ఆరోగ్యం, ఆదాయమూ రెండింతలు పెరుగుతాయట...!

​ధన్వంతరి జన్మ కథ..

సాగర మథనానికి సంబంధించిన ప్రస్తావతనలు భాగవత పురాణం, మహాభారతం, విష్ణు పురాణం, అగ్ని పురాణాల వంటి ప్రాచీన గ్రంథాల్లో సంబంధించిన కథలు మనకు కనిపిస్తాయి. మరో కథనం ప్రకారం, కాశీకి చెందిన ధన్వ అనే రాజు నిత్యం దేవతలను ఆరాధించేవాడు. అందుకే తనకు ధన్వంతరి అనే పుత్రుడు పుడతాడని వరం ఇచ్చారని బ్రహ్మ పురాణంలో ప్రస్తావించబడింది. సాగర మథనంలో కనిపించిన ధన్వంతరి రెండో జన్మగా చెబుతారు.

​ఆయుర్వేద పితామహుడు..

ధన్వంతరిని వైద్యో నారాయణ హరి అని కూడా అంటారు. ధన్వంతరి తన నాలుగు చేతుల్లో అన్ని జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకే తనను ఆయుర్వేద పితామహుడిగా పరిగణిస్తారు. ధన్వంతరి భగవానుడు సుశ్రుతాచార్యకు శస్త్రచికిత్స జ్ఞానాన్ని అందించాడు. సుశ్రుతాచార్యను శస్త్రచికిత్స పితామహుడిగా భావిస్తారు. ధన్వంతరి నుండి చరకచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడు. ఇప్పటికీ మన దేశంలో ఆయుర్వేద సంప్రదాయం చెక్కు చెదరకుండా ఉందంటే.. దాని ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

​విష్ణువు అవతారంగా..

ధన్వంతరిని విష్ణువు అవతారంగా భావిస్తారు. ధన్వంతరి ఆలయం గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని జర్మనీ, అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ధన్వంతరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేటికీ మనలో చాలా మంది వైద్యులు తమకు వైద్యం చేసే శక్తిని పెంచమని ధన్వంతరికి ధన త్రయోదశి రోజున పూజలు చేస్తారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Read Latest Religion News and Telugu News

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.