యాప్నగరం

Dussehra 2022 దసరా పూజా విధానం, శుభముహుర్తం, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...

Dussehra 2022 హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు ముగిసిన మరుసటి రోజే అంటే విజయదశమి లేదా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలో శుక్ల పక్షంలో దశమి తిథి నాడు అంటే అక్టోబర్ 5వ తేదీ బుధవారం నాడు దసరా పండుగ వచ్చింది.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 5 Oct 2022, 12:31 am
Dussehra 2022 హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు ముగిసిన మరుసటి రోజే అంటే విజయదశమి లేదా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలో శుక్ల పక్షంలో దశమి తిథి నాడు అంటే అక్టోబర్ 5వ తేదీ బుధవారం నాడు దసరా పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ పర్వదినాన శ్రీరాముడు లంకాధిపతి రావణుడిని వధించాడని, దుర్గా మాత మహిషాసురుడిని సంహరించిందని నమ్ముతారు. అందుకే ఈ పండుగను విజయదశమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగ రోజునే రావణుడితో పాటు మేఘనాథ్, కుంభకర్ణుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇదే రోజున దుర్గాపూజ కూడా ముగుస్తుంది. ఈ సందర్భంగా దసరా పూజా విధానం, శుభ ముహుర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం...
Samayam Telugu dussehra or vijayadashami 2022 on october 5 know the puja vidhanam shubh muhurat and significance in telugu
Dussehra 2022 దసరా పూజా విధానం, శుభముహుర్తం, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...


​శుభ ముహుర్తం..

పండితుల అభిప్రాయం మేరకు.. దసరా తేదీని అబుజ ముహుర్తంగా పరిగణిస్తారు. ఈ లెక్కన ఈ పవిత్రమైన రోజున ఎలాంటి ముహుర్తం చూడకుండా ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఈరోజున ఎలాంటి కొత్త పని ప్రారంభించినా, వ్యాపారం ప్రారంభించినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఈ రోజున మంచి పనులు చేయడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇదేరోజున ఎన్నో శుభ యోగాలు ఏర్పడనున్నాయి. రవి, సుకర్మ, ధ్రుతి అనే యోగాలు కూడా ఏర్పడనున్నాయి.

​దసరా ప్రాముఖ్యత..

దసరా పండుగ అసత్యంపై సత్యం సాధించిన విజయంగా పరిగణిస్తారు. అందుకే ఈరోజున దుర్గా పూజ, రామ పూజ, శమీ పూజను చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దుర్గా మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు చండీ పథం లేదా దుర్గా సప్తశతి, హవన పఠనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

October Horoscope 2022 అక్టోబర్ నెలలో ఎవరికి అదృష్టం వరించనుంది.. ఏ రాశులకు గొప్ప ప్రయోజనాలు రానున్నాయో ఇప్పుడే చూసెయ్యండి...

​పూజా విధానం...

సాధారణంగా హిందూ మతంలో పండుగలన్నీ ఉదయం వేళలో జరుపుకుంటారు. అయితే దసరా పండుగ రోజున మధ్యాహ్నం వేళలో పూజలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈరోజున ఈశాన్య మూలలో తామర రేకులను ఉంచి, అష్ఠదళాల మధ్యలో అపరాజితాయ నమః అనే మంత్రాన్ని పఠించి దుర్గా మాతను, శ్రీరాముడిని పూజించాలి. అనంతరం అమ్మవారికి కుంకుమ లేదా ఎరుపు రంగు, అక్షింతలు, పువ్వులు నైవేద్యంగా పెట్టి భోగాన్ని సమర్పించాలి. చివరగా అమ్మవారికి హారతి ఇవ్వాలి.

​పాలపిట్టను చూస్తే..

దసరా పండుగ రోజున మగాళ్లు మన్యానికి వెళ్లి మరీ పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అప్పటినుంచి ఈ సంప్రదాయం ప్రతి ఏటా కొనసాగుతూ వస్తోందని పెద్దలు చెబుతారు. అదే విధంగా దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజించాలి. పాలపిట్టను దర్శించుకుంటే మనం చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ పాలపిట్ట కూడా నీలం, పసుపు రంగుల కలయికతో చాలా అందంగా ఉంటుంది. సాంస్కృతికంగా, పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టను చూడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు..

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.