యాప్నగరం

Gayatri Jayanti 2023 ఈసారి గాయత్రి జయంతి ఎప్పుడొచ్చింది? ఈ తల్లికి వేద మాత అనే పేరేలా వచ్చిందంటే...

Gayatri Jayanti 2023 ప్రతి సంవత్సరం హిందూ పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున హిందువులు గాయత్రీ జయంతిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 31వ తేదీ బుధవారం నాడు గాయత్రీ జయంతి వచ్చింది.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 27 May 2023, 2:58 pm
Gayatri Jayanti 2023 హిందూ పురాణాల ప్రకారం, గాయత్రీ మాత జన్మదినాన్ని పురస్కరించుకుని గాయత్రీ జయంతి పండుగను జరుపుకుంటారు. గాయత్రీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సుఖ సంతోషాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. గాయత్రీ మాతను పరబ్రహ్మస్వరూపిణి, వేదమాత, జగత్ మాత అని కూడా అంటారు. కొన్ని గ్రంథాల ప్రకారం, భూమిపై ఉన్న ప్రతి జీవిలో గాయత్రీ తల్లి ప్రాణ-శక్తి రూపంలో ఉంటుంది. అందుకే గాయత్రీ మాతను అన్నీ శక్తులకు ఆధారంగా భావిస్తారు. గాయత్రీ మాత జయంతి రోజున గాయత్రీ దేవిని పూజించడం వల్ల వేదాలను చదివినంత పుణ్యం లభిస్తుందని, కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని, తమ జీవితంలో సంతోషం పెరుగుతుందని, తెలివితేటలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గాయత్రీ జయంతి తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Gayatri Mata Jayanti 2023


శుభ ముహుర్తం..
తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో ఏకాదశి తిథి 30 మే 2023 మంగళవారం నాడు మధ్యాహ్నం 1:07 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజున అంటే 31 మే 2023 బుధవారం నాడు మధ్యాహ్నం 1:45 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి 31వ తేదీన గాయత్రీ జయంతిని జరుపుకుంటారు. ఇదే రోజున నిర్జల ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజున ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. గాయత్రీ దేవి ఆరాధన వల్ల విద్యార్థులకు విద్యలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం గాయత్రీ జయంతి రోజున కనీసం 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. మీరు ఎలాంటి లక్ష్యాల్ని అయినా సులభంగా సాధిస్తారు.
Hindu Marriage Rituals హిందువులు ఒకే గోత్రం వారిని వివాహం చేసుకోరు.. అందుకు గల కారణాలేంటో తెలుసా...
గాయత్రీ జయంతి ప్రాముఖ్యత..
‘భాస్తే సతతం లోకే గాయత్రీ త్రిగుణాత్మికా’’ గాయత్రీ సంహిత ప్రకారం, గాయత్రీ దేవిని సరస్వతి మాత, లక్ష్మీ మరియు కాళికా దేవికి ప్రతీకగా సూచిస్తారు. వేదాలన్నీ గాయత్రీ మాత నుంచి ఉద్బవించాయి. అందుకే ఆ తల్లిని వేదమాత అని కూడా అంటారు. విద్యను అభ్యసించేవారికి, ఆధ్యాత్మిక బోధనలు చేసే వారికి గాయత్రీ జయంతి రోజు చాలా ముఖ్యమైనది. ఈరోజున గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మేధో వికాసం కలుగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చదువులో ఏకాగ్రత కోసం గాయత్రీ మంత్రం ఉత్తమంగా పరిగణించబడుతుంది.

ఎవరైతే మానసిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో లేదా తమ జీవితంలో గొప్ప విజయం సాధించాలని భావిస్తారో.. అలాంటి వారంతా భక్తి శ్రద్ధలతో గాయత్రీ మాతను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

Mysterious Temple ఈ గుడి లోపలికి వెళ్లాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే... ఎందుకో తెలుసా...

గాయత్రి మాత ఎలా పుట్టింది..
పురాణాల ప్రకారం, సృష్టి ప్రారంభంలో బ్రహ్మ దేవుడు తల్లి గాయత్రిని నాలుగు ముఖాలతో ప్రార్థించాడు. తను నాలుగు వేదాల రూపంలో గాయత్రీ మంత్రాన్ని వివరించాడు. దీంతో సంతోషించిన ఆ తల్లి గాయత్రీ అవతారం ఎత్తింది. అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు. గాయత్రీ మంత్రం నాలుగు వేదాల సారాంశాన్ని వివరించింది. పూర్వం గాయత్రీ మంత్రం మహిమలు కేవలం దేవీదేవతలకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజల వరకు తీసుకొచ్చారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.